రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా.. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వరదలు భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి.. రవాణా సదుపాయాలు లేక కష్టపడుతున్నారు. వరద బీభాత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షం కారణంగా ఆలయం కొట్టుకుపోయిన వీడియో వైరలవుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు పురుషోత్తపట్నం లాంచీల రేవులో ఉన్న దుర్గమ్మ ఆలయం గోదావరి నదిలోకి కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెటింట వైరల్గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
15 ఏళ్ల క్రితం స్థానికులు పురుషోత్తపట్నంలో గోదావరి ఎడమగట్టున వనదుర్గ ఆలయాన్ని నిర్మించి.. అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని.. పూజలు చేయడానికి పెద్ద ఎత్తున మహిళలు ఆలయం దగ్గరకు చేరుకున్నారు. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా మధ్యాహ్నం సమయానికి ఆలయం పక్కకు ఒరగడంతో భయాందోళనలకు గురై భక్తులు బయటకు వచ్చారు. ఈ క్రమంలో సాయంత్రానికి ఆలయం మరింతగా నీటిలోకి జారి.. మెల్లగా వరదలో కొట్టుకుపోయింది. ఈ దృశ్యాలు చూసిన జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పురుషోత్తపట్నం లాంచీల రేవులో ఉన్న దుర్గమ్మ ఆలయం గోదావరి నదిలోకి కొట్టుకుపోయింది pic.twitter.com/Pv5XNBriVQ
— Sekhar Rambo (@RamboSekhar) July 30, 2022