Bangalore: బెంగళూరులో ఓ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. దేవతామూర్తి విగ్రహం మెడలో నాగుపాము కొలువు దీరింది. గత కొద్దిరోజులుగా గుళ్లోనే ఉంటున్న పాము దేవత మెడలో కొలువుదీరుతోంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు నగరంలోని రామొహళ్లిలో శ్రీ సిద్ధి పీఠ మహేశ్వరీ, చౌడీశ్వరీ దేవాలయం ఉంది. గత మూడు రోజుల నుంచి ఓ నాగుపాము ఈ గుడికి వస్తోంది. అంతేకాదు! చౌడేశ్వరీ దేవి మెడలో నాగాభరణంలా కొలువు దీరుతోంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న భక్తులు ఎంతో పారవశ్యం చెందుతున్నారు. దేవీ మహిమ వల్లే ఇలా జరుగుతోందని సంతోషపడుతున్నారు. నాగుపాము దేవత మెడలో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతంలో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనిలో రెండు తాచుపాములు శివుడి విగ్రహంపై కనిపించాయి. మహాదేవుడి శిరస్సు మీద పడగ విప్పిన తాచుపాములను చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. దైవ మహత్మ్యంగా భావించి కొందరు భక్తిపారవశ్యంలో మునిగితేలగా.. మరికొందరు మాత్రం ఆ దృశ్యాన్ని సెల్ఫోన్లలో బంధించారు. మరి, చౌడేశ్వరీ దేవి మెడలో నాగాభరణంలా కొలువు దీరిన నాగుపాముపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : కోతుల గ్యాంగ్ వార్.. గ్రూపులుగా విడిపోయి బాహుబలి రేంజ్ లో ఫైటింగ్!