ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో.. 14 రంగాల్లో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ పెట్టుబడులకు సంభందించి కీలక ప్రకటన చేశారు.
విశాఖ సాగర నగరం వేదికగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్ కు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు సహా 45కు పైగా దేశాల నుంచి దౌత్యవేత్తలు, 14 వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్లో పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ వేదికగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటు జరగనుంది. దేశంలో అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉన్న ప్రాంతం కావడంతో దేశ విదేశీ పారిశ్రామిక వేత్తలు ఎక్కువ ఆసక్తి కనపరిచారు. మొత్తం రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు అప్ సీఎం జగన్ వెల్లడించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎంఆశాభావం వ్యక్తం చేశారు. తొలిరోజు 8.54 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరుగుతాయని.. మిగిలినవి రేపు జరుగుతాయని జగన్ వివరించారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్న రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఏపీలో పెట్టుబడులు పెట్టడంపై కీలక ప్రకటన చేశారు. ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. “సమ్మిట్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. పలు రంగాల్లో ఏపీ నంబర్వన్గా మారుతున్నందుకు శుభాకాంక్షలు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రెండో రాష్ట్రం ఏపీ. వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే ఉన్నారు. సీఎం జగన్ సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోంది.నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతోంది. ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాం..” అని అంబానీ తెలిపారు.
సీఎం వైయస్ జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన భారతదేశ నిర్మాణంలో కీలకం కాబోతోంది#AndhraPradesh #APGIS2023 #AdvantageAP #APGlobalInvestorsSummit pic.twitter.com/eMirQqUdfi
— YSR Congress Party (@YSRCParty) March 3, 2023