ఈ సమాజంలో ఆడ, మగ మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్ అని మూడో వర్గం కూడా ఉంది. వారు ఉన్నారని అందరికీ తెలుసు. వారిని రోజూ రోడ్డు మీదో, రైలులోనో, సిగ్నల్స్ దగ్గరో చూస్తూనే ఉంటాం. వారు కూడా అందరితోపాటు ఈ సమాజంలోనే బతుకుతున్నారు. కానీ అందరిలా బతుకుతున్నారా? అందరిలా బతికే అవకాశం వారికి దొరుకుతోందా? అనేదే ప్రధాన ప్రశ్న. ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో అధిక శాతం వ్యక్తులు చేసే వృత్తి భిక్షాటన, పడుపు వృత్తి అని అందరికీ తెలిసిందే.
ఇదీ చదవండి: వీడియో: చూస్తూ చూస్తూ రైలు కింద పడిపోయిన కానిస్టేబుల్.. కారణం?
అయితే వాళ్లు ఆ పనులు ఎందుకు చేస్తున్నారు? అందరిలా జీవించే అవకాశం వారికి ఎందుకు దొరకడం లేదు? ఈ సమాజంలో వాళ్లు కూడా సాధారణ వ్యక్తులుగా బతకాలంటే ఏం మార్పులు రావాలి? ఈ ప్రశ్నలకు సుమన్ టీవీ, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ సంయుక్తం చేపట్టిన ఖడ్గం కార్యక్రమంలో సమాధానాలు వెతికే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ట్రాన్స్ జెండర్స్.. వారి కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వారు ఈ సమాజంలో ఏ విధమైన అన్యాయాలకు గురవుతున్నారో తెలిజయేశారు. ట్రాన్స్ కమ్యూనిటీని సమాజం ఆమోదిస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.