కొన్ని రోజుల క్రితం హైదరాబాద్, బంజారాహ్సిల్లోని రాడిసన్ హోటల్ పబ్లో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు పబ్ మీద దాడి చేసిన సమయంలో అక్కడ మెగా డాటర్ నిహారిక ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక మీడియా చానెల్స్ అన్ని ఈ విషయాన్ని హైలెట్ చేశాయి. చివరకు నాగబాబు.. ఈ సంఘటనలో నిహారిక తప్పు ఏం లేదని.. అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరుతూ.. వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: డ్రగ్స్ కేసులో నిహారికకు నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు!
ఈ సంఘటనపై తాజాగా ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి స్పందించారు. నిహారిక విషయంలో మీడియా అత్యుత్సాహం చూపిందని.. అక్కడ జరిగిన సంఘటన ఒకటి అయితే.. నిహారిక ఫుటేజ్ ప్రసారం చేసి.. ఆమెను మానసికంగా హింసించారని విమర్శించారు. అసలు అక్కడ జరిగిన సంఘటనకు.. మీడియాలో వచ్చిన వార్తలకు సంబంధం లేదని.. నిహారిక మెగా డాటర్ కావడంతోనే ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే నిహారిక వ్యక్తిగత జీవితం గురించి కూడా ఏవేవో వార్తలు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపకపోతే.. చెప్పుతో కొట్టిన విధంగా సమాధానం చెప్తానని వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని తమన్నా సింహాద్రి హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమన్నా సింహాద్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Artist #TamannaSimhadri Reacts On #NiharikaKonidela Issue #Niharika @IamNiharikaK #SumanTV pic.twitter.com/9fQtTj9P0z
— SumanTV (@SumanTvOfficial) April 6, 2022
ఇది కూడా చదవండి: MLA రోజాకు భారీ షాక్.. భర్తపై అరెస్ట్ వారెంట్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.