నగరాల్లో కొత్త వ్యాపారం మొదలైంది. స్పా, థెరపీ ముసుగులో వ్యభిచార గృహలను నడుపుతున్నారు. పేరుకేమో మసాజ్ సెంటర్లు.. లోపలికెళితే గలీజు దందా నడుస్తుంది. ఉద్యోగాల కోసం నగరానికి వస్తున్న యువతులను కూడా మభ్య పెట్టి ఈ రొంపలోకి దింపుతున్నారు.
నగరాల్లో కొత్త వ్యాపారం మొదలైంది. స్పా, థెరపీ ముసుగులో వ్యభిచార గృహలను నడుపుతున్నారు. పేరుకేమో మసాజ్ సెంటర్లు.. లోపలికెళితే గలీజు దందా నడుస్తుంది. ఉద్యోగాల కోసం నగరానికి వస్తున్న యువతులను కూడా మభ్య పెట్టి ఈ రొంపిలోకి దింపుతున్నారు. డబ్బు ఆశ చూపి లేదా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. పోలీసులకు తెలిసినా కూడా కొన్ని సార్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో యజమానుల ఆగడాలకు అంతు ఉండటం లేదు. రసిక రాజాలు ఇలాంటి స్పా సెంటర్లను చూసుకుని వస్తున్నారు. అయితే ఈ వ్యాపారం వెనుక పెద్ద మనుషులు ఉంటున్నారు. పోలీసులకు చిక్కినప్పుడు ఇటువంటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి.
బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 12లోని పీస్ రెయిన్ స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందింది. స్పా ముసుగులో అమ్మాయిలను తీసుకు వచ్చి వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారంతో రైడ్ చేశారు. వ్యభిచారం జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ స్పా సెంటర్ నిర్వాహకుడు సయ్యద్ బిల్లాల్తో పాటు నలుగురు విటులు ఫహద్, హసీదుద్దిన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్లను అరెస్టు చేశారు. వీరంతా నగరంలోని ప్రముఖుల కుమారులని తెలుస్తుంది. ఐదుగురు యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు తేలింది. ఆ అమ్మాయిలను రెస్క్యూ హోంకు తరలించారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.