పక్షులు, జంతువులు పెంచుకోవడం అంటే అందరకి సరదానే. కొందరైతే వాటిని వదిలి క్షణం కూడా ఉండలేరు. ఎటైనా వెళ్తున్నారంటే వాటిని కూడా వెంట బెట్టుకెళ్లాల్సిందే. కాసేపు అవి కనిపించకపోతే.. ఆహా ఇక ఏమైనా ఉందా?.. ఏడవడమే. తాజాగా బీహార్లోని గయాకు చెందిన ఓ కుటుంబం కూడా తమ పెంపుడు చిలుక కోసం ఇలానే ఆరాటపడిపోతున్నారు. ఆ చిలుక కోసం వెతకని చోటు లేదు. చేయని ప్రచారం లేదు. ఇప్పుడు ఏకంగా పోస్టర్లు వేయించి.. పట్టించిన వారికి భారీ నజరానా ఉంటుందని ప్రకంటించారు.
బీహార్ రాష్ట్రంలోని గయాలో నివసించే శ్యామ్దేవ్ ప్రసాద్ గుప్త, సంగీత గుప్త దంపతులకు పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. పక్షులను కూడా సొంత బిడ్డల తరహాలో అపురూపంగా చూసుకుంటారు. అలా పన్నెండేళ్లుగా ఓ చిలుకను పెంచుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి చిలుక కనిపించకుండా పోయింది. దీంతో ఆ కుటుంబం నానా హైరానా పడుతోంది. చిలుకను కనిపెట్టడానికిచేయని ప్రయత్నం లేదు..వెతకని చోటులేదు. ఈ నేపథ్యంలో తమ చిలుక కనిపించడం లేదని గయాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా శ్యామ్దేవ్ కుటుంబీకులు పోస్టర్లు అతికించారు.
ఇది కూడా చదవండి: Viral Video: క్లాస్లో లవర్ ను ముద్దాడిన అబ్బాయికి షాకింగ్ ట్విస్ట్!
తమ చిలుకను పట్టిస్తే రూ.5,100 బహుమతి ఇస్తామని పోస్టర్లలో వెల్లడించారు. 12 ఏళ్లుగా తాము ఈ చిలుకను పెంచుకుంటున్నామని.. తమ చిలుకను ఎవరు తీసుకెళ్లినా తిరిగి ఇచ్చేయాలని శ్యామ్దేవ్ దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిలుక ఆచూకీపై సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. చెట్ల దగ్గరకు వెళ్లి రోజూ తాము మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నా చిలుక దొరకడం లేదని వాళ్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరి చిలుకపై ఇంత ప్రేమ పెంచుకున్న ఈ దంపతులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Finders may get a cash reward of Rs 5,100 on finding the bird. Pet parrot ‘#Popo’ goes missing… pic.twitter.com/fYI051pt6e
— FootBallFanClub (@FootBallFanClu7) May 6, 2022