డబ్బు లేదా పరిస్థితులు లేదా ఇతర ప్రలోభాలకు లోనయ్యి కొంత మంది మహిళలు తప్పుడు మార్గంలోకి వెళ్లిపోతున్నారు. భర్త కాదని పరాయి వ్యక్తుల కోసం మూడు ముళ్ల బంధానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నారు.
డబ్బు లేదా పరిస్థితులు లేదా ఇతర ప్రలోభాలకు లోనయ్యి కొంత మంది మహిళలు తప్పుడు మార్గంలోకి నడుస్తున్నారు. భర్త కాదని పరాయి వ్యక్తుల కోసం మూడు ముళ్ల బంధానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పరిచయమైన మూడో వ్యక్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని, కట్టుకున్న భర్తను కాదని వారి కోసం వెళ్లిపోతున్నారు. నిండు జీవితాన్ని చేజేతులా కాలరాసుకుంటున్నారు. తాము ఊబిలో కూరుకుపోతున్నామన్న విషయం ఆలస్యంగా గ్రహించి.. బయటపడేలోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. చివరకు సరిదిద్దుకోలేని తప్పు వల్ల కుటుంబం మొత్తం అతలాకుతలం అవుతుంది. పోనీ భర్త మందలిస్తే.. తనకోసమే చెప్పాడని గ్రహించని మహిళ.. మరో మార్గంలోకి వెళ్లిపోతుంది.
భార్య మరొకరితో పరిచయం పెంచుకుని, తనను దూరంగా పెట్టిందని గ్రహించిన భర్త.. బంధువులతో మాట్లాడి, కౌన్సిలింగ్ ఇప్పించాడు. అయితే ఏమైందో ఏమో మహిళ కనిపించకుండా పోయింది. వివరాల్లోకి వెళితే..2020లో ఖైరతాబాద్ మారుతీనగర్లో నివాసముండే గూడూరు గణేష్కు ఖమ్మం జిల్లాకు చెందిన శ్రావణితో వివాహం జరిగింది. వీరికి 2021లో పాప పుట్టింది. ఆ తరువాత పుట్టింటికి వెళ్లిన తన భార్య 5 నెలల తరువాత తిరిగి వచ్చింది. ఆ తర్వాత తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. విషయం ఆరా తీయగా పుట్టింటికి సమీపంలో ఓ వ్యక్తితో కాస్త చనువుగా మాట్లాడుతుందని తెలిసి.. కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు భర్త.
ఆ తర్వాత బాగానే ఉంది భార్య. ఈ నెల 12వ తేదీ నుండి రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తకు భార్య, పాప కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో, అత్తమామలకు ఫోన్ చేసి అడగ్గా అక్కడికి రాలేదని చెప్పారు. దీంతో భర్త గణేష్ ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.