కోవిడ్ మహహ్మరి విజృంభణతో మరోమారు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడడం లేదు. పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో సామాన్య ప్రజలపై దారుణంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఇదే కారణంతో మహిళను ఆమె కూతురి ముందే నడిరోడ్డుపై పడేసి, ఆమె జుట్టును లాగుతూ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. ఓ మహిళను చితకబాది చిక్కుల్లో పడిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సరుకులు కొనుక్కుని వెళ్లడానికి బయటకు వెళ్లింది. ఆమె మాస్కు ధరించకపోవడాన్ని చూసిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడానికి వాహనం ఎక్కాలని చెప్పారు.
ఆమె ఎక్కకపోవడంతో ఓ లేడీ పోలీసు దాడి చేసింది. తల్లిని కొట్టొద్దని ఆమె కూతురు వేడుకుంటున్నప్పటికీ పోలీసులు ఆ యువతిని పక్కను లాగి పడేశారు. మాస్కు పెట్టుకోని మహిళను వాహనంలోకి ఎక్కాలంటూ నడిరోడ్డుపైనే కొట్టారు. ఆమె ఎంతకీ ఎక్కకపోవడంతో ఆమె జుట్టుపట్టుకుని, రోడ్డుపై పడేసి లేడీ పోలీసు కొట్టింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చూస్తోన్న నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్ఫోన్లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.