ఉప్పు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు వంటల్లోనే కాకుండా ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను అధికమించవచ్చు. ఎంత కష్టపడినా కొంతమందికి ధనం నిలువదు. ఉప్పు – ఐశ్వర్యానికి సంబంధం ఉంది. మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి అవతరించింది. ఎంత కష్టం చేసినా చేతిలో డబ్బు నిలవదు అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. డబ్బు ఎల్లప్పుడూ వృధా ఖర్చు కాకుండా ఉండాలి అంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా సముద్రపు ఉప్పును నీళ్ళలో వేసి ఆ నీటిలో ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మూలమూలనా ఉన్న మురికి పోవడంతో పాటు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.
అలాగే ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి నైరుతి మూలన పెడితే పట్టిన దరిద్రం వదిలిపోతుందట. ఇలా రోజూ నీటిని మారుస్తూ ఉంచాలి. ఆ నీరు ఎరుపు రంగులో మారుతుందేమో గమనించాలి. అలాగే ఒక హాలులో సీసాలో కొద్దిగా ఉప్పు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచింది. బాత్ రూంలో కూడా ఒక సీసా ఉప్పు వేసి ఉంచాలి.
గాజు బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోయండి. అలాగే అందులో కొద్దిగా కళ్ళు ఉప్పు ని కూడా వేయండి. అప్పుడు ఈ గాజు బౌల్ మన ఇంట్లో ఎక్కువగా తిరగని చోట ఉంచండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఐదు రోజుల తర్వాత మరల ఉప్పు బయట వేసి తిరిగి మరల ఇలా చేయండి. ఇలా తరచుగా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ పోయి మంచి ఫలితం కలుగుతుంది.