తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి భద్రాచలంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయం. రామాయణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న దేవాలయాల్లో ఇది ఒకటి. రాముడు,సీత నడయాడిన ప్రాంతంగా కొలవబడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి భద్రాచలంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయం. రామాయణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న దేవాలయాల్లో ఇది ఒకటి. రాముడు,సీత నడయాడిన ప్రాంతంగా కొలవబడుతోంది. త్రేతాయుగంలో పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో భాగంగా దండకారణ్యంలో జీవించే సమయంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఇక్కడకు వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ అక్కడ ఆ కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయని చెబుతుంటారు. ప్రతి ఏడాది భద్రాద్రిలో శ్రీరామ నవమి రోజున అంగరంగ వైభవంగా సీతా రాముల విగ్రహాలకు కళ్యాణం జరుగుతుంది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు తండోపతండాలు ప్రజలు తరలివస్తారు. ఆ రోజు లభించే పానకం, వడపప్పు ప్రసాదంతో పాటు తలంబ్రాల కోసం కూడా ప్రజలు క్యూ కడుతుంటారు. దీనికి కారణం స్వయంగా ఆ అక్షింతలు తీసుకుని చల్లుకుంటే.. మంచి జరుగుతుందని ఉవాచ.
ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వచ్చే శ్రీరామనవమి పండుగకు తలంబ్రాలు కూడా విశిష్టత ఉంది. అయితే ఈ తలంబ్రాల కోసం ముత్యాలతో పాటు వరికూడా వినియోగిస్తున్నారు. భద్రాద్రికి ప్రతి ఏటా ఏపీ నుండి కూడా తలంబ్రాలు వెళుతుంటాయి ఈ వరిని పండించే దగ్గరి నుండి గింజను వేరు చేసే వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో పనులు చేస్తారు. అయితే దీనికి సంబంధించిన పనులు మొదలు పెట్టారు రైతులు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ఉన్న పొలంలో ప్రత్యేకంగా ఈ వరిని సాగు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పంట వేసే సమయంలో కూడా రైతులు నిష్టతో కార్యక్రమాన్ని చేపడతారు. దేవుళ్ల వేషధారణలో రైతులు సాగు ప్రారంభిస్తారు. పొలంలో సీతారాముల వారికి పూజలు చేసి.. సాగు చేస్తుంటారు.
కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఏటా భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను పంపుతారు. ఈ సంఘ అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో విత్తనాలు జల్లి.. సాగును ప్రారంభించారు రైతులు. దేవుళ్ల వేషధారణను ధరించి ఆ పొలంలో సీతారాముల విగ్రహాలను ఉంచి, పూజలు చేసి, వారిని కీర్తించారు రైతులు. ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వేషధారణలతో ఉన్న భక్తులు సీతారాముల విగ్రహాలకు వరి విత్తనాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం రాముని కీర్తలను ఆలపిస్తూ.. స్వయంగా పొలంలో విత్తనాలు జల్లారు. ఈ పంట పండించిన తర్వాత ఒడ్లను సేకరించి, గోటితో ఒలిపించిన కోటి అక్షింతలను పంపిస్తుండటం ఆనవాయితీగా కొనసాగుతుంది.