తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ఎందోమంది చనిపోయి కుటుంబ సభ్యులు పెద్దదిక్కు కోల్పోతున్నారు.
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రెప్పపాటున జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకుల బలిఅవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య వరుసగా రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒకదశలో ఇంటి నుంచి బయిటికి వస్తే క్షేమంగా ఇళ్లు చేరుతామా? లేదా ? అన్న అనుమానాలు వస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు హనుమకొండ ప్రధాన రహదారిపై ఆరెపల్లి దర్గా సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులోకి లారూ సగం వరకు దూసుకు వచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. మొత్తానికి అక్కడి వాతావరణం భీతావాహంగా ఉంది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులు ఆర్తనాలు చేయడంతో స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులను బయటకు తీసుకువచ్చారు. దగ్గరాలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుందని.. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రధాన రహదారి పై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ని క్రమబద్దీకరణ చేశారు.