ప్రస్తుతం మనం బతుకున్నది టెక్నాలజీ యుగంలో. ప్రతిదీ మన చేతిలో ఉన్న మొబైల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే దీని వల్ల లాభం కన్నా నష్టమే అధికంగా ఉంది. ప్రతిదీ ఆన్లైన్ చేయడంతో మన వ్యక్తిగత సమాచారం ఈజీగా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఆ వివరాలు..
ప్రస్తుతం మన జీవితం నెట్తో అనుసంధానం అయ్యింది. తెలియని విషయం గురించి తెలుసుకోవాలన్నా.. ఆన్లైన్ షాపింగ్ మొదలు.. వార్తలు చదవడం వరకు ప్రతిదీ మన ఫోన్లోనే అయిపోతున్నాయి. అయితే మనం నెట్లో దేని గురించి సర్చ్ చేయాలన్నా సరే.. బ్రౌజర్ చాలా అవసరం. ప్రస్తుతం కంప్యూటర్లు, మొబైల్స్లో ఎక్కువ మంది వినియోగించే సర్చ్ ఇంజన్ గూగుల్ క్రోమ్. ఈ క్రమంలో భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఈ హెచ్చరికను పట్టించుకోకపోతే మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వడం పక్క అని హెచ్చరించింది. మరి ఇంతకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వార్నింగ్ ఎందుకు జారీ చేసిందో తెలియాలంటే ఇది చదవాలి.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ప్రతి నిమిషం లక్షల మంది వారి రోజువారి పనుల నిమిత్తం క్రోమ్ను వాడుతుంటారు. ప్రస్తుతం మన నిత్య జీవితంలో చాలా వాటి కోసం ఆన్లైన్ మీదే అధికంగా ఆధారపడుతున్నాం. కొన్ని సందర్భాల్లో మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అందించాల్సి వస్తోంది. అయితే బ్రౌజర్లో ఇలా సెన్సిటీవ్ ఇన్ఫర్మేషన్ని వెల్లడించడం ప్రమాదకరం. ఈ వివరాలు హ్యాకర్ల చేతికే చిక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకు హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. పాత గూగుల్ క్రోమ్ వినియోగిస్తున్న వారి బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు చాలా సులువుగా దొంగిలిస్తున్నారని తెలిపింది.
ఈ బ్రౌజర్లో పర్సనల్ సమాచారాన్ని హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేస్తున్నారని కేంద్రం హెచ్చరించింది. పాత గూగుల్ క్రోమ్ వాడుతున్న వారు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇక ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకే గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్లను అప్డేట్ చేస్తుంటుంది. అందుకే మనం వాడే బ్రౌజర్లను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ మనం పాత వర్షన్ బ్రౌజర్లను వాడుతుంటే మాత్రం ప్రమాదంలో పడినట్టే. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి మీ చేతులారా మీరే అవకాశం కల్పించినట్లు అవుతుంది అంటున్నారు.
ఈ నేపథ్యంలో విండోస్ వినియోగదారులు 110.0.5481.77/.78 వర్షన్ను.. మ్యాక్, లైనెక్స్ యూజర్లు 110.0.5481.77 వర్షన్ కంటే పాతవి ఉపయోగిస్తున్నవారికి ఇండియన్ గవర్నమెంట్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో యూజర్ల సమాచారాన్ని హ్యాకర్లు ఎలా చోరీ చేస్తున్నారో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. హ్యాకర్స్ బారిన పడకూదంటే గూగుల్ తెస్తున్న కొత్త వర్షన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. ఈ విషయంలో క్రోమ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు.