బంగ్లాదేశ్ తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా చేజేతులా ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో క్యాచ్ లు వదిలేసి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. దాంతో టీమిండియాపై మాజీలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ఓటమితోనైనా టీమిండియా బుద్ది తెచ్చుకోవాలని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆటగాళ్లపై మండిపడ్డ సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో టీమిండియా మాజీ ఆటగాడు భారత జట్టుపై ప్రశ్నలతో విరుచుకుపడ్డాడు. అసలు ఈ మ్యాచ్ లో టీమిండియా డెత్ బౌలర్ ఎవరు అంటూ భారత జట్టును సూటిగా ప్రశ్నించాడు స్టార్ ఫీల్డర్, మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్.
బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ హసన్ క్యాచ్ డ్రాప్ చేయకుంటే టీమిండియా 31 పరుగులతో విజయం సాధించి ఉండేది. కానీ అలా జరగలేదు. అదీకాక మరో క్యాచ్ పట్టే అవకాశాన్ని వాపింగ్టన్ సుందర్ నిర్లక్ష్యం కారణంగా మిస్ అయ్యింది. దాంతో మ్యాచ్ కాస్త భారత్ చేతుల్లోంచి బంగ్లా చేతుల్లోకి వెళ్లింది. ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడు మాట్లాడుతూ..”ఈ గేమ్ ఇండియాదే.. కానీ చివర్లో ఒత్తిడి కారణంగా ఓటమి పాలైయ్యారు. మెుదటి నుంచి బౌలర్లు అద్భుతంగా రాణించారు. అయితే ఈ గేమ్ లో బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలం అయ్యారు. అయితే లాస్ట్ 10 ఓవర్లలో టీమిండియా డెత్ బౌలర్ ఎవరు? దీపక్ చాహర్ లేదా కుల్దీప్ సేన్? ఈ ఇద్దరిలో ఎవరు?” అంటూ టీమిండియాను ప్రశ్నించాడు కైఫ్.
ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ కు అండగా నిలబడ్డాడు కైఫ్. ఈ మ్యాచ్ లో రాహుల్ క్యాచ్ డ్రాప్ చేశాడు కాదనలేం. కానీ అతడు అద్భుతమైన ఫీల్డర్. మెున్న జరిగిన టీ20 వరల్డ్ కప్ లో లిట్టన్ దాస్ ను రనౌట్ చేసిన విషయం మర్చిపోవద్దని కైఫ్ చెప్పుకొచ్చాడు. అయితే నన్ను మాత్రం సుందర్ క్యాచ్ కు ట్రై చేయకపోవడ ఆశ్చర్యానికి గురి చేసిందని కైఫ్ పేర్కొన్నాడు. ఇలాంటి మ్యాచ్ ల్లో ఆటగాళ్లు ఒత్తిడికి గురికావడం సహజమేనని, అయితే ఆటగాళ్లు ఒత్తిడిని జయిస్తేనే రాబోయే ప్రపంచ కప్ లో టీమిండియాకు మంచి ఫలితాలు వస్తాయని కైఫ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
Mohammad Kaif raised an important question that the Indian team ought to take under consideration.#BANvINDhttps://t.co/NSkIH9rGvC
— CricTracker (@Cricketracker) December 5, 2022