సుదీర్ఘ కాలంలో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ కు వెన్నెముకలా నిలుస్లున్న సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్ ప్రపంచానికి "బజ్ బాల్" అంటూ ఇంగ్లాండ్ టెస్టుల మీద కూడా ఆసక్తి కలిగేలా చేస్తుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా దిగ్గజ బ్యాటర్ తనదైన శైలిలో స్పందిస్తూ భారత్ ని ఈ విషయంలోకి లాగాడు.
దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కి ధోని ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2023 లో భాగంగా ధోని దగ్గరకు వచ్చి సునీల్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకోవడం టోర్నీ మొత్తానికే హైలెట్ నిలిచింది. అయితే ఎన్నోసార్లు ధోనీని కూల్ కెప్టెన్ అని చెప్పుకొచ్చిన గవాస్కర్ తాజాగా మరొకరి పేరు చెప్పడం ఇప్పడు వైరల్ గా మారింది.
భారత్ క్రికెట్ లో ఒకప్పుడు చోటు సాధించాలంటే రంజీల్లో తప్పనిసరిగా రాణించాల్సిందే. ముఖ్యంగా టెస్టుల్లో స్తానం కావాలంటే మాత్రం రంజీలు ఒక్కటే ప్రత్యామ్నాయం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు జాతీయ జట్టులో చోటు కావాలంటే ఐపీఎల్ ఆడితే సరిపోతుంది. దీంతో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ సెలక్షన్ విధానాన్ని తప్పు పట్టాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తం భారత బ్యాటింగ్ యూనిట్ ఫెయిలైంది. అజింక్యా రహానె తప్పె ఎవరూ పెద్దగా రాణించలేదు. ఈ ఓటమి నేపథ్యంలో ఒక మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరూ ఫెయిలైనా సెలెక్టర్లు మాత్రం ఛటేశ్వర్ పుజారానే బలి చేస్తున్నారని చెప్పాడు.
భారత క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మీద టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. డబ్బుల కోసం దిగజారే వీళ్లేనా మన రోల్ మోడల్స్ అంటూ ఫైర్ అయ్యాడు.
ఆఫ్ సైడ్ బాల్స్ వెంటాడి వికెట్ కోల్పోవడం కోహ్లీకి ఎప్పటి నుంచో ఉన్న బలహీనత. ప్రత్యర్థి బౌలర్లు ఇలాంటి అస్త్రాన్నే ఉపయోగించి కోహ్లీ వికెట్ సంపాదిస్తారు. తాజాగా నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా బౌలర్లు పదే పదే ఆఫ్ సైడ్ బంతులను వేస్తూ కోహ్లీ వికెట్ తీయడంలో సఫలమయ్యారు. దీంతో ఇప్పుడు భారత్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కోసం ఆడి ఔటయ్యాడు అని ఫైర్ అయ్యాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ గెలుస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ ఫైనల్లో భారత్ ఓటమి దాదాపు ఖాయమైనట్టే. కానీ సునీల్ గవాస్కర్ మాత్రం టీమిండియాకు అండగా నిలిచాడు.
జూన్ 7 న భారత్- ఆస్ట్రేలియా మధ్య లండ లోని ఒవెల్ లో డబ్ల్యూటీసి ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ కి సంబంధించి దిగ్గజాలు తమ విశ్లేషణతో పాటు కీలక సలహాలు కూడా ఇస్తున్నారు. తాజాగా భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా భారత్ గెలవాలంటే ఒక కీలకమైన సలహా ఇచ్చేసాడు.
మరో వారం రోజుల తర్వాత జరగనున్న డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఇప్పటికే భారత క్రికెటర్లు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ప్రాక్టీస్ ప్రారంభించేసారు. ఇక నిన్నే ఐపీఎల్ ఆడిన గుజరాత్, చెన్నై జట్టులోని జడేజా, గిల్, షమీ, రహానే ఇంగ్లాండ్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ గురించి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.