గతేడాది అబుధాబీ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా సెమీస్ కూడా అర్హత సాధించకుండా ఇంటిదారి పట్టింది. పోనీ, ఈ ఏడాదైనా ఆ కల నెరవేరుతుందా? అంటే.. ప్రస్తుత ఐపిఎల్ సీజన్ లో సీనియర్ల పర్ఫామెన్స్ చూశాక.. ఈ సారి కూడా పరాభవం తప్పదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయబోయే ఆటగాళ్ల గురుంచి ఆసక్తికర వార్తలు బయటకొస్తున్నాయి. ఐపీఎల్ టోర్నీలో విఫలమైన సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి యువ ఆటగాళ్ల వైపు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ 2007 టీ20 వరల్డ్ కప్ నాటి ఫార్ములాను అనుసరించనున్నట్లు వాతాలొస్తున్నాయి.
ప్రస్తుత టీమిండియాలో కీలక ప్లేయర్లంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. అయితే ఈ ఇద్దరు ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్ కూడా వాళ్ల స్థాయికి తగ్గది ఆడలేకపోయారు. రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు, విరాట్ ఓ హాఫ్ సెంచరీ చేసినా టీ20లను వన్డేలా ఆడాడు. ఇక.. చెన్నై కెప్టెన్గా ఐపీఎల్ 2022 సీజన్ని ఆరంభించిందిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, అట్టర్ ఫ్లాప్ పర్పామెన్స్ ఇచ్చాడు. దీంతో సీనియర్లను తప్పించి, 2007 టీ20 వరల్డ్కప్ ఫార్ములాని ఇప్పుడు ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు నెటిజన్లు. ఆ దిశగానే గంగూలీ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
2007 వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభవం తర్వాత జరిగిన టీ20 వరల్డ్కప్ 2007 టోర్నీలో సచిన్, ద్రావిడ్, గంగూలీ వంటి సీనియర్లు పాల్గొనలేదు. రోహిత్ శర్మ, శ్రీశాంత్, రాబిన్ ఊతప్ప, యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అజిత్ అగార్కర్, జోగిందర్ శర్మ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలిచ్చారు. అయితేనేం.. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీని ఆరంభించిన భారత జట్టు, ఫైనల్లో పాకిస్తాన్ని ఓడించి.. మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. సచిన్, గంగూలీ, ద్రావిడ్ల అనుభవంలో పదో వంతు అంతర్జాతీయ అనుభవం కూడా లేని కుర్రాళ్లు, పొట్టి ప్రపంచకప్లో చెలరేగిపోయారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్కి చుక్కలు చూపించారు. ఇప్పుడు కూడా టీమిండియా పరిస్థితి దాదాపు సేమ్. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు.
A young team led by MS Dhoni was selected to go for the T20 World Cup in South Africa.
India won the inaugural edition of the T20 World Cup on 24th September, 2007 and the rest as they say is history.#ThankYouMSDhoni pic.twitter.com/INkSOlAJOP
— BCCI (@BCCI) August 16, 2020
#OnThisDay back in 2007
Team India Created a history as they uplifted the first T20 World Cup trophy under MS Dhoni’s Captaincy#msdhoni #t20worldcup #TeamIndia pic.twitter.com/f0N4ddwkt3
— Organiser Weekly (@eOrganiser) September 24, 2021
ఇది కూడా చదవండి: Sourav Ganguly: రోహిత్ శర్మ, కోహ్లీల ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ బాస్ గంగూలీ
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2022 కు కుర్రాళ్లతో కూడిన జట్టును పంపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఎమ్మెస్ ధోనీని కెప్టెన్గా చేసినట్టు, ఇప్పుడు రిషబ్ పంత్కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని నియయించారని సమాచారం. రిషబ్ పంత్తో పాటు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, శుబ్మన్ గిల్, మోహ్సీన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ వంటి కుర్రాళ్లతో నిండిన టీమ్ని వరల్డ్ కప్ కు ఎంపిక చేయాల్సిందిగా నెటిజన్స్ సూచిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విరాట్, రోహిత్, జడేజా వంటి మ్యాచ్ విన్నర్లను పక్కనబెట్టి, కొత్త కుర్రాళ్లతో నిండిన జట్టును టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి పంపే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చు. మరి టీ20 వరల్డ్ కప్ కు సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి, యువ ఆటగాళ్లను ఎంపిక చేయడం కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
How about Team India selecting a squad for T20 World Cup 2022 just like what they did in 2007 with WK Rishabh Pant as Captain? 😍
Check out this interesting article 👆https://t.co/GdgfJ798PK#T20WorldCup2022
— Cricalytics🏏 (@cricalytics) May 16, 2022