దేశంలో ఐపీఎల్ సమరం ముగిసింది. ఇప్పుడు ఫోకస్ అంతా.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ గురుంచే. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. జూన్ 9 నుంచి భారత్- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. టీమిండియాతో టీ20 సిరీస్లో విజయం సాధిస్తామని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమా విశ్వాసం వ్యక్తం చేశాడు. సీనియర్లకు విశ్రాంతినిచ్చినప్పటికీ భారత ఆటగాళ్లను తక్కువగా అంచనా వేయలేమని చెప్పిన బవుమా.. ఇరు జట్ల మధ్య హోరాహోరీ తప్పదని అభిప్రాయపడ్డాడు. అలానే.. ఐపీఎల్ గురుంచి కూడా తన మనసులో మాట బయటపెట్టాడు.
ఐపీఎల్ ఆడాలని ప్రతి ఒక్క ఆటగాడు కలకంటాడన్న బవుమా.. తన కల కూడా అదే అని చెప్పుకొచ్చాడు. ‘ఐపీఎల్ ఆడాలనేది నా కల. తప్పకుండా.. ఏదో ఒకరోజు ఐపీఎల్ లో ఆడతా. కాలం కలిసి వస్తే కెప్టెన్గా కూడా అవుతా. అయితే, అంతకంటే ముందు ఏదో ఒక జట్టులో ఆడే ఛాన్స్ రావాలి. ఐపీఎల్లో ఇప్పటికే చాలా మంది ప్రొటిస్ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఏబీ డివిలియర్స్ మొదలు డెవాల్డ్ బ్రెవిస్ వరకు చాలా మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు” అని బవుమా ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో 33 మంది ప్రొటిస్ ప్లేయర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో బవుమా లేకపోవడం గమనార్హం.
Temba Bavuma on David Miller- “He has performed exceedingly well in the IPL”#TeamIndia #INDvSA #BCCI pic.twitter.com/4THssGUmCA
— Cricket Addictor (@AddictorCricket) June 2, 2022
ఇది కూడా చదవండి:
ఐపీఎల్ టోర్నీకి సౌతాఫ్రికా ఆటగాళ్లు కొత్తేమి కాదు. హర్షల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్,ఇమ్రాన్ తాహిర్.. ఇలా చాల మంది ఆటగాళ్లు ఐపీఎల్ టోర్నీలో మెరిశారు. ఇక.. ఐపీఎల్ 2022లో.. కగిసో రబడ,అన్రిచ్ నోర్ట్జే, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, మార్కరమ్, మార్కో జాన్సెన్ తదితరులు ఆయా జట్ల విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక మిల్లర్.. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. టైటిల్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. ఈ క్రమంలో వీరందరిపై ప్రశంసలు కురిపించిన బవుమా.. ఐపీఎల్లో మంచి ప్రదర్శన నమోదు చేశారని పేర్కొన్నాడు.
Best knock of this IPL
Take a bow Quinton De Kock ❤️#quintondekock #LSGvsKKR pic.twitter.com/5RLUfEu4yR— umran malik🇮🇳 (@umranmalik555) May 18, 2022
కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత్ లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా తదితరులకు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టీమిండియా సారథిగా వ్యవహరించనున్నాడు.
South African cricket team arrives at Delhi airport ahead of India vs South Africa T20 series starting from 9th June. pic.twitter.com/Qf7uDkSmQV
— ANI (@ANI) June 2, 2022
టీ20 సిరీస్: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్.
18-member #TeamIndia squad for the upcoming five-match Paytm T20I home series against South Africa.#INDvSA @Paytm pic.twitter.com/tK90uEcMov
— BCCI (@BCCI) May 22, 2022