ప్రస్తుతం ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లతో టీమిండియా ఆటగాళ్లంతా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. రోహిత్ శర్మ సారధ్యంలోని సీనియర్ల జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా.. హార్దిక్ పాండ్యా సారధ్యంలోని మరో జట్టు ఐర్లాండ్ తో రెండు టీ20ల సిరీస్ లో పాల్గొననుంది. అయితే టీమిండియా ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలేలా ఉంది. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కలేదు. అతను కరోనా బారినపడటమే అందుకు కారణం. ఆర్టీపీసీఆర్ టెస్టులో అశ్విన్ కు పాజిటివ్ రాగానే వెంటనే క్వారంటైన్ కు తరలించారు. ఇంగ్లాండ్ తో టెస్టు నేపథ్యంలో అశ్విన్ కు కరోనా సోకడంతో అభిమానులు నిరాశకు గరవుతున్నారు.
జులై 1న టీమిండియా- ఇంగ్లాండ్ టెస్టు జరగనుంది. కరోనా బారిన పడిన అశ్విన్ కనీసం రెండు వారాలు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ టెస్టుకు ముందే కోలుకుంటాడని బీసీసీఐ భావిస్తోంది. మిగిలిన జట్టు సభ్యులందరూ ఇప్పటికే లీసెస్టర్షైర్ చేరుకున్నారు. జూన్ 24న 4 రోజుల వార్మప్ మ్యాచ్, జులై1న డెర్బీషైర్ తో టీ20 వార్మప్ మ్యాచ్, రీషెడ్యూల్ట్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. జులై3న రెండో టీ20 వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. ఆ తర్వాత జులై 7 నుంచి 3 టీ20 మ్యాచ్లు, 3 వన్డే మ్యాచుల్లో టీమిండియా- ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
India allrounder R Ashwin has tested positive for Covid-19, and as a result, not yet travelled to England for the upcoming Edgbaston Test#ENGvIND
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2022
సోమవారం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లండన్ బయలుదేరి వెళ్లాడు. ద్రవిడ్ తో పాటు పంత్, శ్రేయాస్ అయ్యర్ కూడా ఇంగ్లాండ్ వెళ్లారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఉన్నందున ద్రవిడ్, పంత్, శ్రేయాస్ ఇంగ్లాండ్ టూర్ కు అందరితోపాటు కాకుండా ఆలస్యంగా వెళ్లారు. మరోవైపు హార్దిక్ పాండ్యా కేప్టెన్సీలో మరో జట్టు గురువారం ఐర్లాండ్కు బయలుదేరి వెళ్తోంది. హార్దిక్ పాండ్యా సారధ్యంలోని జట్టు ఐర్లాండ్తో రెండు టీ20 మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఈ జట్టుకు హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ ను అపాయింట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ తో టెస్టుకు దూరం కావడంతో టీమిండియాకి నష్టం వాటిల్లుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ashwin misses flight to England after testing positive for Covid-19
Read @ANI Story | https://t.co/bpTLAXmowR#RavichandranAshwin #RAshwin #IndiaTourOfEngland #BCCI #Cricket #COVID19 pic.twitter.com/gxDK0dC4nK
— ANI Digital (@ani_digital) June 21, 2022