కరోనా అన్నీ రంగాలని ప్రభావితం చేస్తున్నట్టే.. క్రీడా ఈ రంగాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే ఇండియాలో కరోనా కారణంగా క్రికెట్ షెడ్యూల్స్ వాయిదా పడుతుండటం ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తోంది. కరోనా కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ ఇంకా పూర్తి కాలేదు. ఇక తాజాగా ఇండియా vs శ్రీలంక సిరీస్ కూడా వాయిదా పడటం అందరికీ షాక్ కలిగిస్తోంది.
యువ రక్తంతో శ్రీలంకలో అడుగు పెట్టిన టీమ్ ఇండియా అక్కడ దుమ్ము రేపడం ఖాయమని అంతా అత్రుతుగా ఎదురుచూస్తున్న వేళ, శ్రీలంక టీమ్ లో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ జట్టు కోచ్ అండీ ప్లవర్ తో పాటు.., మరికొందరు కరోనా గురయ్యారు. దీంతో.., అందరిని పరీక్షలు నిమిత్తం క్వారెంటైన్ కి తరలించారు. ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు మ్యాచ్ లను వాయిదా వేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 13 నుంచి సీరీస్ మొదలు కావాల్సి ఉంది. కానీ.., ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో సిరీస్ నాలుగు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూలై 17న మొదటి వన్డే జరగనుంది. 19న రెండో వన్డే, 21న మూడో వన్డే జరగనుంది. అలాగే జూలై 24న తొలి టీ20, 25న రెండో టీ20, 27న మూడో టీ20 నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్లన్నీ కూడా కొలంబో వేదికగా జరగనున్నాయి. అయితే.., ఇది కూడా ఫైనల్ షెడ్యూల్ అని చెప్పుకోవడానికి వీలు లేదు.
ఒకవేళ మధ్యలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. ఈ డేట్స్ మారిపోవచ్చు. ఇక మొత్తం యువకులతో నిండిన టీమ్ ఇండియా ఈ సీరీస్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. మరోవైపు శ్రీలంక క్రికెట్ టీమ్ పెర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఏమి లేదు. ఇంగ్లాండ్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్లలో లంక జట్టు ఘోర ఓటములను చవి చూసింది. ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టు టీమ్ ఇండియాకి ఎంత వరకు పోటీ ఇస్తుందో చూడాలి.