ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఏడాదిని ముంబై, చెన్నై ఫ్రాంచైజీలు, వాళ్ల అభిమానులు అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే టేబుల్ లాస్ట్ పొజీషన్ కోసం ఈ రెండు టీమ్లు కొట్టుకుంటున్నాయి. గుజరాత్ తో మ్యాచ్ లోనూ సీఎస్కేకి ఓటమి తప్పలేదు. అయితే ఈ ఓటమికి మిల్లర్, రషీద్ ఖాన్ కారణమని అందరికీ తెలిసిందే. అయితే ఇంకొకరు కూడా కారణం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతను మరెవరో కాదు శివమ్ దూబే. అవును డేవిడ్ మిల్లర్ గాల్లోకి లేపిన బంతిని దూబే క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం ఇంకోలా ఉండేది. కానీ శివమ్ దూబే బద్ధకానికి సీఎస్కే బలైంది. మరోవైపు జడేజా, బ్రావో కోపం కట్టలు తెంచుకుంది. జడేజా క్యాప్ కూడా విసిరికొట్టబోయాడు.
ఇదీ చదవండి: IPLలో దినేష్ కార్తీక్ మెరుపులు! టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయమా?
గుజరాత్ జట్టులో మిల్లర్(94*), రషీద్ ఖాన్(40) మినహా రన్స్ చేసింది ఎవరూ లేదు. 17వ ఓవర్ లో మిల్లర్ 78 మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్రావో వేసిన బంతిని బౌండిరీకి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని బౌండిరీకి దూరంగా గాల్లో లేచింది. బౌండ్రీ మీదున్న శివమ్ స్పీడ్ గా పరిగెత్తుకు వచ్చి ఒక్కసారిగా స్లో అయ్యాడు. అతనికి రెండు అడుగుల దూరంలో బాల్ ల్యాడ్ అయ్యింది. అతను ఇంకాస్త వేగంగా పరిగెత్తుంటే క్యాచ్ అయ్యేది. మిల్లర్ ఔటయ్యేవాడు. ఆ సమయంలో బ్రావో, జడేజా ఎంతో అసహానినికి లోనయ్యారు. జడేజా క్యాప్ తీసి విసిరికొట్టబోయి.. కంట్రోల్ చేసుకున్నాడు. అయితే జడేజా కోపానికి అర్థముందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. శివమ్ దూబే వల్లే సీఎస్కే మ్యాచ్ ఓడిపోయిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Addicric (@addicric) April 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.