ఏ మనిషికైనా వృత్తి జీవితం.. వ్యక్తిగత జీవితం రెండూ ఉంటాయి. కానీ క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఫ్యామిలీతో గడపడానికి తగినంత టైమ్ ఉండకపోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఆసియా కప్ టోర్నీ ముగియటంతో కొందరు టీమిండియా ఆటగాళ్లు తమ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా విషయం తెలిసిందే. నిన్న ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్యతో కలిసి దుబాయ్ లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా విరాట్ కోహ్లీ సైతం భార్య అనుష్క శర్మతో లండన్ వీధుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పిక్స్ ను అనుష్క తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ.. ఈ జోడీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. విరాట్ తనదైన క్లాస్ టచ్ తో ఆసియా కప్ లో మంచి ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అనుష్క శర్మ తన మూవీ ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే విరాట్ 3ఏళ్ల తర్వాత శతకం సాధించి.. ఆ శతకాన్ని తన భార్య అనుష్కకు తన కూతురు విరుష్కకు అంకితం ఇచ్చాడు. ఇక తన భర్త సెంచరీ సాధించినందుకు తన ఆనందాన్ని సైతం సోషల్ మీడిలో అభిమానులతో పంచుకుంది అనుష్క. ప్రస్తుతం అనుష్క లండన్ లో మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. “చక్దా ఎక్స్ ప్రెస్” మూవీ షూటింగ్ లో భాగంగా లండన్ లో అనుష్క ఉంది.
ఇక తాజాగా ఆసియా కప్ ముగిసిన వెంటనే కోహ్లీ లండన్ చేరుకున్నాడు. సరదాగా ఈ జంట లండన్ వీధుల్లో రోడ్ సైడ్ కాఫీ షాప్ లో దర్శనం ఇచ్చింది. నవ్వులు పూయిస్తూ ఉన్న ఈ జంట ఫోటోలను చక్దా ఎక్స ప్రెస్ మూవీ యాక్టర్ క్లిక్ మనిపించాడు. ఇక ఈ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రెడ్ కలర్ లో లవ్ సింబల్ ని అనుష్క జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ పై సెలబ్రిటీలు స్పందిస్తూ.. సో క్యూట్ కపుల్.. అంటూ లవ్ సింబల్స్ జత చేస్తున్నారు. అటు బాలీవుడ్ లో.. ఇటు క్రీడా ప్రపంచంలో ఈ జంట ఎప్పుడూ సెట్రాఫ్ అట్రాక్షన్ అనే చెప్పాలి. మరి కోహ్లీ-అనుష్క ల జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.