బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ప్రభాస్. ఇక అప్పటి నుంచి వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ.. దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా అభిమానులను దక్కించుకున్నాడు. ఇక దేశవ్యాప్తంగా ప్రభాస్కు సూపర్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన గౌరవం అందుకున్నాడు డార్లింగ్. ఏటా ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో దసరా పండుగ సందర్భంగా రావణదహనం కార్యక్రమం జరిగే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ ఏడాది రావణ దహనం చేసే అరుదైన గౌరవం దక్కించుకున్నాడు ప్రభాస్. ఈ మేరకు రామ్ లీలా కమిటీ సభ్యులు అతడికి ఆహ్వానం పంపించారు. దసరా ఉత్సవాలకు విశిష్ట అతిథిగా విచ్చేసి.. రామ్లీలా మైదానంలో రావణ దహనం చేయాలని ఆహ్వానంలో వెల్లడించారు. ఇందుకు ప్రభాస్ సైతం అంగీకరించారు.
ఇక ఈ ఏడాది అక్టోబర్ 5న విజయ దశమి వేడుకలు జరగనున్నాయి. అయితే..సెప్టెంబర్ 26 నుంచే రావణ దహనం వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక ప్రతి ఏటా ఒక్కో థీమ్తో మండపాన్ని నిర్మిస్తుండగా.. ఈ ఏడాది నిర్వహించే వేడుకలకు అయోధ్యలోని రామ మందిరం రూపంలో మండపాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నిర్వహాకులు. అయితే, కృష్ణం రాజు మృతి చెందడానికి ముందే ఢిల్లీ నుంచి ప్రభాస్కు ఈ ఆహ్వానం అందిందని.. అప్పుడు ఆయన ఓకే చెప్పారని సమాచారం. కానీ కృష్ణంరాజు మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ రావణ దహన కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది సందేహమే.
ఇక చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్బంగా పలు ప్రాంతాల్లో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఇక ఈ ఏడాది ఢిల్లీ రామ్లీలా రావణ దహనం కార్యక్రమానికి ప్రభాస్ను ఆహ్వానించడం గురించి లవకుశ రామ్ లీలా కమిటీ చీఫ్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నాడు. అందుకే ప్రభాస్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించామని’’ తెలిపారు. ప్రభాస్ తన బాణంతో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారని తెలిపారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దిష్టిబొమ్మలు 100 అడుగుల ఎత్తులో ఉండనున్నాయని తెలిపారు.
అంతేకాక ఎప్పటి లాగే ఈసారి కూడా రావణుడితో పాటు కుంభ కర్ణుడు, మేఘనాథ్ భారీ దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రావణుడితో పాటు కుంభ కర్ణుడు, మేఘనాథ్ల బొమ్మలను సైతం ప్రభాసే దహనం చేయనున్నట్లు అర్జున్ కుమార్ వెల్లడించారు. ఇక గతంలో ఈ వేడుకలకు అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి నటులు విశిష్ట అతిథిలుగా హాజరయ్యి రావణ దహనం చేశారు. ఈ ఏడాది ప్రభాస్కు ఆహ్వానం అందింది. మరి తను హాజరవుతాడో లేదో చూడాలి. కానీ ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.