సరదాగా స్నేహితులతో కలిసి డివిజినల్ క్రికెట్ టీమ్ సెలెక్షన్స్కు వెళ్లి.. కెరీర్ను మలుపుతిప్పుకున్న భారత క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఈశ్వర్ పాండే క్రికెట్కు వీడ్కోలు తెలిపాడు. పాండే దేశవాళీ క్రికెట్తోపాటు టీమిండియా-ఏ, ఐపీఎల్లో సత్తా చాటాడు. 12వ తరగతిలో ఉన్నప్పుడు తన స్నేహితులకు కలిసి డివిజనల్ టీమ్ సెలెక్షన్కు వెళ్లిన పాండే.. అనూహ్యంగా ఎంపిక కావడం ఆ తర్వాత మధ్య ప్రదేశ్ అండర్19 టీమ్లో చోటు దక్కడంతో తన కెరీర్ పూర్తిగా మారిపోయింది. 2012-13లో జరిగిన రంజీ ట్రోఫీ సీజన్లో పాండే టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. నిజానికి పాండే తండ్రికి తన ఇద్దరు కుమారులు చదువుల్లో రాణించాలని ఆక్షాంక్షించాడు. కానీ.. పాండే యూనివర్సిటీ కోచ్ కన్విన్స్ చేయడంతో ఆయన పాండే క్రికెట్ను కెరీర్గా మల్చుకోవడానికి అనుమతించారు.
6.2 అడుగులు ఉండే పాండే.. 130 కిలో మీటర్ల వేగంతో మంచి బౌన్సర్లు వేసేవాడు. రంజీలో మంచి ప్రదర్శన ఆధారంగా న్యూజిలాండ్ పర్యటన కోసం ఇండియా ఏ టీమ్కు ఎంపికయ్యాడు. ఐపీఎల్లో తొలుత పుణెవారియర్స్ ఇండియా జట్టుకు నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. అలాగే రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్లో కూడా ఆడాడు. 34 ఏళ్ల వయసులో పాండే క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పాండే తన కెరీర్లో మొత్తం 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 945 పరుగులతో పాటు 263 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతని ఎకానమీ కేవలం 2.90 మాత్రమే. 13 సార్లు 5 వికెట్ల హాల్, 3 సార్లు 10 వికెట్ల హాల్ సాధించాడు. అలాగే 58 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 127 రన్స్తో పాటు 63 వికెట్లు సాధించాడు. 25 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన పాండే 18 వికెట్లు పడగొట్టాడు. 6 క్యాచ్లు కూడా అందుకున్నాడు. మరి పాండే రిటైర్మెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Congratulations @pandey_ishwar and good luck for future. https://t.co/dRD0dx8oue#IshwarPandey #IndianCricketer #retirement #IshwarPandeyRetire #Cricket @BCCI @ChennaiIPL @msdhoni @ImRaina #madhyapradeshcricket
— B Times (@btimesofficial) September 12, 2022