‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో సాయి ప్రణీత్ సేవలను మోదీ కొనియాడారు. సాయి ప్రణీత్ గత ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నారు. ఆకస్మిక వర్షాలు పడతాయని ముందస్తుగా హెచ్చరించడంతో రైతులు తమ తమ పంట ధాన్యాలను భద్రపర్చుకుంటున్నారు. రైతులకు, ఇతర ప్రజలకు ఈ వాతావరణ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతోంది. సాయి ప్రణీత్ టాలెంట్ కు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. వాతవరణ వివరాలను అందిస్తూ రైతులు, ప్రజలకు ఎంతో సాయపడుతున్నారని మోదీ అభినందించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 79వ ఎపిసోడ్లో భాగంగా మోదీ పలు కీలక విషయాలపై ప్రసంగించారు.
ఇప్పుడు సాయి ప్రణీత్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏపీ వెదర్ మ్యాన్ గా ఎలా మారాడన్నదానిపై చర్చ జరుగుతోంది. ఇటీవల వచ్చిన అల్పపీడనాలు, భారీ వర్షాల గురించి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసిన ప్రణీత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నాడు ఈ సూపర్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్.
టెంపుల్ సిటీ తిరుపతిలో మేఘాలను చూస్తూ చిన్ననాటి నుంచే ఎంతో ఆనందించే వాడట. వయస్సు పెరిగే కొద్ది వాతావరణ పరిస్థితులపై అవగాహనా తెచ్చు కోవాలని ప్రయత్నం చేస్తూ, సమాచారాన్ని సేకరించే వాడు. ఇక కాలేజీ చదివే రోజుల్లో అతనికి తల్లితండ్రులు మొబైల్ కొనిచ్చారు. దాంట్లో ఉండే వెదర్ యాప్ అతనిని ఎంతగానో ఆకట్టుకుంది. అన్ని సమాచారాలను అనుసంధానం చేసి ప్రజలకు ఉపయోగ పడే అంచనాలు రూపొందిస్తున్నాడు.
వర్షం, ఎండ, ఉరుములు, తుఫాను, ఉష్ణోగ్రత వివరాలను రోజువారీ అప్ డేట్ నుంచి నెల వారి అప్ డేట్ వరకు ఫేస్ బుక్, యూట్యూబ్, ట్వీట్టర్, బ్లాగ్స్ లో పోస్ట్ చేస్తూ ప్రజలను, రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నాడు. తుఫాన్, ఉరుముల సమయంలో ముందుగానే పసిగట్టి తన బ్లాగ్స్ లో సమాచారాన్ని చేరవేస్తున్నారు.
సాయి ప్రవీణ్ బ్లాగ్ కు 1.20 లక్షల మంది, పేస్ బుక్ పేజ్ కు 28 వేల మంది, ట్విట్టర్లో 7 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
Inspiring life journeys from Andhra Pradesh and Odisha, which show how technology is being harnessed for greater good.
Do know more about @APWeatherman96 and Isak Munda. pic.twitter.com/gMI66NvoWq
— PMO India (@PMOIndia) July 25, 2021