భారత్ కలియుగ దేవంగా కొలిచేది వెంకటేశ్వర స్వామిని. ఆ ఏడు కొండల వాడు కొలువైన ప్రాంతం తిరుపతి. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. ఈ దేవాలయం చుట్టూ అనేక ప్రసిద్ధగాంచిన కట్టడాలు ఉన్నాయి.
భారత్లో కలియుగ దేవంగా కొలిచేది వెంకటేశ్వర స్వామిని. ఆ ఏడు కొండల వాడు స్వయంబుగా కొలువైన ప్రాంతం తిరుపతి. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. భక్తి, శ్రద్ధలతో పూజలు చేస్తారు. కాలినడక లేదా క్యూలైన్లలో వెంకటేశ్వర స్వామిని దర్శించి లడ్డు, ప్రసాదాలు స్వీకరిస్తారు. నిత్యం ఈ ప్రాంతం గోవింద నామ స్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే వాడిగా వెంకటేశ్వరునికి పేరుంది. అందుకే మొక్కులు తీర్చేందుకు భక్తులు తరలివస్తుంటారు. ఇక ప్రత్యేక పర్వదినాల్లో ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు టీటీడీ అధికారులు.
ఈ దేవాలయం చుట్టూ అనేక ప్రసిద్ధగాంచిన కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటి రాయల కాలంలో నిర్మించిన రాతి మండపం. అయితే ఇటీవల ఓ పురాతన కట్టడం కూల్చివేశారు టీటీడీ అధికారులు. దీనిపై పలు పుకార్లు షికార్లు చేశాయి. వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని కూల్చివేసి..ఈ స్థానంలో మరో కొత్త నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ పారు వేట మండపం వెయ్యేళ్ల నాటిదని తెలుస్తోంది. తిరుమల నుండి పాపనాశనానికి వెళ్లే మార్గంలో ఈ మండపం ఉంది. ఇందులో పై భాగంలో స్వామివారిని కొలువు తీర్చి ఉత్సవ సేవలు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పైభాగాన్ని పూర్తిగా తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్థానంలో మరింత ఆకర్షణీయంగా నూతన మండపాన్ని నిర్మించనున్నారు.