Lagadapati Rajagopal: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు లగడపాటి రాజగోపాల్. ఆయన 2014 ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనను తన సాయశక్తులా అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. కానీ, రాజకీయాలను మాత్రం వదల్లేదు. 2014 ఎన్నికల టైంలో ఎన్నికల సర్వేలు నిర్వహించి సంచలనం సృష్టించారు. 2014 ఎన్నికల ఫలితాలపై ఆయన చేసిన సర్వేలు నిజమయ్యాయి. దీంతో ఆయన ఆంధ్రా ఆక్టోపస్గా పేరు గడించారు. అయితే, 2018,2019 ఎన్నికల టైంలో మాత్రం సర్వే ఫలితాలు రివర్స్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి. దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన వార్తల్లోకి ఎక్కారు. లగడపాటి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం.
తాజాగా, లగడపాటి ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో ఓ వివాహ వేడుకకు హజరయ్యారు. అనంతరం మైలవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో భేటీ అయ్యారు. ఈ భేటీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాకుండా.. కొన్ని పుకార్లకు తెర తీసింది. లగడపాటి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వైఎస్సార్ సీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై లగడపాటి కానీ, ఆయన వర్గం కానీ, ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి, లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీ ఎంట్రీపై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మంత్రి పదవి నాకు వెంట్రుకతో సమానం: కొడాలి నాని!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.