మెగాబ్రదర్ నాగబాబు సినిమాలు, రాజకీయాల్లో ఎంత యాక్టీవ్గా ఉంటారో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. కార్యకర్తలతో మాట్లాడుతూ.. పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రారని.. కాకపోతే ఆయన పూర్తి మద్దతు జనసేనకే అంటూ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నేడు తాజాగా మరో కీలక ప్రకటన చేశారు నాగబాబు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తాను పోటీ చేయడం లేదనే విషయాన్ని ప్రకటించారు. జనసేన పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, నాగబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి పవన్ కల్యాణ్ మాత్రమే పోటీ చేస్తారని ఇంకెవరూ పోటీ చేయరని స్పష్టం చేశారు. తాను పూర్తిగా పార్టీ సేవకే అంకితమవుతానన్నారు.
2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభా స్థానం నుంచి నాగబాబు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ తరపున నర్సాపురం నుంచి గెలిచారు. అయితే నాగబాబు ఇరవై శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. పవన్ కళ్యాణ్ చెప్పే ఆదర్శల ప్రకారం చూస్తే కుటుంబ సభ్యులను ప్రోత్సహించకూడదని.. కానీ నాగబాబుకు మాత్రం పిలిచి టిక్కెట్ ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ అప్పట్లో ఈ విమర్శలను పట్టించుకోలేదు.
ఇది కూడా చదవండి: Nagababu: జనసేనలోకి చిరంజీవి.. నాగబాబు ఏమన్నారంటే!
ఈ సారి మెగా ఫ్యామిలీ నుంచి పవన్ మాత్రమే పోటీ
వచ్చే ఎన్నికల్లో కూడా నాగబాబు పోటీకి రెడీ అవుతారని అనుకున్నారు. కానీ తాను పార్టీ సేవకే తప్ప ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో మెగా కుటుంబం నుంచి ఇంకెవరూ పోటీ చేసే అవకాశం లేదని భావిస్తున్నారు. జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్.. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తప్పక పోటీ చేయాల్సి ఉంటుంది. చిరంజీవి నాయకత్వంలో ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీలోనూ నాగబాబు కీలక పాత్ర పోషించారు. అయితే అప్పట్లో కూడా ఆయన పోటీ చేయలేదు. అల్లు అరవింద్ అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయని సంగతి తెలిసిందే. మరి నాగబాబు ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్ విస్తరణ.. వైసీపీ మంత్రులకు నాగబాబు రిక్వెస్ట్!