ఓటీటీ ఆడియెన్స్ను అలరించడానికి మరో మూవీ అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘విమానం’. సముద్రఖని, అనసూయ భరద్వాజ్ లాంటి స్టార్ నటులు యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోనే చూసేయొచ్చు.
సముద్రఖని.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని నటుడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం ‘అల వైకుంఠపురంలో’, మాస్ మహారాజా రవితేజ మూవీ ‘క్రాక్’తో తెలుగునాట మంచి క్రేజ్ సంపాదించారాయన. అయితే నటుడిగా కంటే ముందు దర్శకుడిగా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు సముద్రఖని. రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ కలసి నటించిన ‘శంభో శివ శంభో’ సినిమాను డైరెక్ట్ చేసింది సముద్రఖనే కావడం విశేషం. ఆ తర్వాత కాలంలో ఆయన నటుడిగా మారారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకునే సముద్రఖని ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ ‘విమానం’. ఇందులో ఆయనతో పాటు అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. శివ ప్రసాద్ యానాల తెరకెక్కించిన ‘విమానం’ సినిమా జూన్ 9న థియేటర్లలో రిలీజైంది.
‘విమానం’ కలెక్షన్ల సంగతి అటుంచితే.. మంచి చిత్రంగా ఆడియెన్స్ మనసులను గెలుచుకుంది. స్టార్ నటి అనసూయ ఇందులో వేశ్య పాత్రలో కనిపించడం గమనార్హం. ఎప్పటిలాగే తనకు ఇచ్చిన క్యారెక్టర్ను సమర్థంగా పోషించారామె. ‘విమానం’లో సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ తర్వాత మంచి అటెన్షన్ తీసుకున్న పాత్రల్లో అనసూయది కూడా ఒకటి. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో జూన్ 30 నుంచే ‘విమానం’ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 సంస్థ ఈ విషయాన్ని తెలుపుతూ ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. ఈ మూవీలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్తో సాగే సీన్స్ ప్రేక్షకులను బాగా మెప్పించాయి. బిగ్ స్క్రీన్స్లో ఈ సినిమాను చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.