గులాబీ సినిమాతో మొదలైనా కోయిల స్వరం సీతారామం వరకు కొనసాగింది. ఇంకా వినిపిస్తూనే ఉంది. సింగర్ సునీత ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. తన సాంగ్స్ తో మెస్మరైజ్ చేస్తుంటారు. ఎన్నో పాటలు పాడి.. మెప్పించారు. అయితే ఇప్పుడు ఆమె మనసు గుబులుగా ఉందంటోన్నారు.
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని మనస్సును మెలిక పెట్టేసి, చివరికీ మిగిలేదీ అంటూ కంటతడి చేసుకుని, కన్నుల ముందు నీ కళలే అంటూ విరహ గీతాన్నిఆలపించి.. తన గొంతుతో ఎన్నోహావ భావాలు పలకించగల సింగర్ సునీత. సున్నితత్వంతో కూడిన వాయిస్తో మెస్మరైజ్ చేస్తుంటారు. ఆమె పాటలే కాదూ మాటలు కూడా తియ్యగా ఉంటాయి. సుమారు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల అందరి దగ్గర ఆమె పాటలు పాడారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత.. అభిప్రాయ బేధాల కారణంగా భర్త నుండి విడిపోయారు. రామ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే సునీత ఇప్పుడు మనసు గుబులుగా ఉందంటూ ఓ వీడియోలో పేర్కొన్నారు
ఇంతకు ఆమె ఆ పోస్టు ఎందుకు పెట్టారంటే..ఆమె తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ ప్లస్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా రో్జుల తర్వాత ఓ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. రంగ మార్తాండ అనే సినిమాను ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఆయన భార్య రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఈ మూవీ స్పెషల్ షో వేశారు. సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఈ చిత్రాన్ని వీక్షించి డైరెక్టర్ కృష్ణవంశీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. రంగమార్తండ సినిమా చూస్తున్నంతసేపు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన సునీత కూడా తన స్పందనను తెలియజేశారు.
ఈ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సునీత. ‘ఇప్పుడే ఈ సినిమాను చూశాను. వీడియో చేయకుండా ఉండలేకపోతున్నాను. ఒక సినిమాలో ఒక మూడు క్యారెక్టర్స్.. ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయంటే.. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వారి నటనతో మనసంతా,గుండెంతా బరువైపోయింది. చాలా గుబులుగా అనిపిస్తుంది. ఇటువంటి రెగ్యులర్గా ఉంటే బయటపడేందుకు రకరకాల మార్గాలు వెతుకుతుంటాం. కానీ నా స్టిట్యుయేషన్ ఏంటో తెలుసా.. ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉంటేనే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది. అలాగే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అలాంటి గొప్ప పెర్ఫామెన్స్ ఆర్టిస్టుల నుంచి రాబట్టుకోవడం డైరెక్టర్ కృష్ణవంశీకే సాధ్యం. హేట్సాప్. స్ట్రాంగ్లీ రికమెండ్. కచ్చితంగా ఈ సినిమాను చూడండి. ఈ సినిమా మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు చాలా ఉన్నాయి’ అంటూ ఎమోషనల్ అయ్యారు.