తిరుమల- కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడమంటే ఎంతో పుణ్యం చేసుకోవడమేనని చాలా మంది భక్తుల విశ్వాసం. ఇక దేశం నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచంలోని పలు దేశాల నుంచి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. దీంచో నిత్యం వేలాది మంది భక్తులకు టీటీడీ దర్శన ఏర్పాట్లు చేస్తుంటుంది. అందుకే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది.
ఇక కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీనారి సర్వ దర్శనాన్ని నిలిపివేసింది. కేవలం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని మాత్రమే కొనసాగిస్తోంది. అది కూడా ప్రతి నెల పరిమితమైన టిక్కెట్లను జారీ చేస్తోంది. నెలనారి కోటాను ప్రతి నెల 20వ తేదీన విడుదల చేస్తూ వస్తోంది టీటీడీ. కానీ ఈ సారి మాత్రం సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యం అయ్యింది
సెప్టెంబరు నెలకు సంబంధించి స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 300 రూపాయల టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ‘tirupatibalaji.ap.gov.in’ వెబ్సైట్, ‘Govinda’యాప్ల ద్వారా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. కొవిడ్ కారణంగా ప్రస్తుతం ఇస్తున్న తరహాలోనే రోజుకు 8 వేల టికెట్లను కేటాయిస్తున్నారు. భక్తులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని టీటీడీ కోరింది.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటున్న భక్తులు ఖచ్చితంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లును తీసుకోవాలి. అది కూడా కేవలం ఆన్ లైన్ ద్వారానే ఈ టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవాలి. మరింకేందుకు ఆలస్యం శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ‘tirupatibalaji.ap.gov.in’ వెబ్సైట్, లేదా ‘Govinda’యాప్ల ద్వార 300 రూపాయల దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకొండి.