‘తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి’అని సామెత. అంటే అవి అంత బాగుంటాయి మరీ. అలాగే మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాలకు కూడా కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏ గుడికి వెళ్లినా.. ఆ దేవుణ్ణి/దేవతను స్మరించుకున్నాక, ప్రసాదాలను కచ్చితంగా తీసుకుంటాం.
‘తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి’అని సామెత. అంటే అవి అంత బాగుంటాయి మరీ. అలాగే మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాలకు కూడా కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏ గుడికి వెళ్లినా.. ఆ దేవుణ్ణి/దేవతను స్మరించుకున్నాక, ప్రసాదాలను కచ్చితంగా తీసుకుంటాం. లేకపోతే.. ఏదో కోల్పోయమన్నా ఫీలింగ్ ఉంటుంది. ఒక్కో గుడిలో ఒక్కో ప్రసాదం ఫేమస్. దేశంలోనే భక్తులు ఎక్కువ మంది సందర్శించే దేవాలయాల్లో ఒకటి తిరుపతి. తిరుపతి అనగానే నిలువెత్తు శ్రీవారి స్వరూపమే కాదూ.. అక్కడి లడ్డూ ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం కూడా. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో దొరికే ప్రసాదం కూడా మరెక్కడా దొరకదు. విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో పులిహోర రుచిని చూస్తే.. వదలరు. ఇలా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రసాదం ప్రఖ్యాత గాంచింది.
అలా మన తిరుపతిలో కూడా లడ్డూ ప్రసాదాన్ని తీసుకోకుండా భక్తులు ఇంటి ముఖం తిరిగిపట్టరు. ఎందుకంటే ఉంటే లడ్డూ పరిమాణం కానీ, క్వాలిటీకీ ఫిదా అయిపోతుంటారు భక్తులు. శ్రీవారి దర్శించుకున్నాక, లడ్డూను ప్రసాదంగా అందిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). అయితే ఇక ఆ రుచి ఉండకపోవచ్చునని తెలుస్తోంది. శ్రీవారి భక్తులకు ఇది చేదువార్తే. ఎందుకంటే ఆ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కర్ణాటక నుండి వచ్చేదట. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్ (KMF))కి చెందిన నందిని నెయ్యిని తిరుమల లడ్డూకి వాడేవారట. సుమారు 50 ఏళ్ల నుండి ఆ సంస్థ టీటీడీకి నెయ్యిని సరఫరా చేస్తూ వస్తుండగా.. ఇప్పుడు వీరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇకపై నందిని నెయ్యిని పంపబోమని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
లడ్డూలకు రుచిని అందించడంలో నందిని నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయితీపై నెయ్యి అందిస్తూ వస్తుంది సదరు సంస్థ. ప్రతి ఆరు నెలలకు 14 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేస్తుంది. అయితే ఈ సారి రాయితీపై నెయ్యి అందించలేమని చెప్పి.. తగ్గింపు ధరకు అందించే టెండర్ను కేఎంఎఫ్ విరమించుకుంది. దానికి కారణం కూడా పాల ధరలు ఇటీవల పెరగడమే కారణంగా తెలుస్తోంది. ఇటీవల కర్ణాటకలో పాల ధరలు లీటరుపై రూ. 3 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెయ్యి ధర కూడా పెరగడంతో రాయితీపై ఇవ్వలేని పరిస్థితి. ఏదైనా తక్కువ ధరకు బిడ్ వేస్తే.. నాణ్యత విషయంలో రాజీ పడలేమని చెప్పారు భీమా నాయక్.