ఇటీవల దేశానికి వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే టమాటా ధరలు పెరగడం. ప్రతి ఒక్కరూ టమాటా ధర పెరుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంట్లో ఏ కూర లేకపోయినా.. టమాటా చారుతో రసం పెట్టుకుని ఆ పూట భోజనం చేసే కుటుంబాలున్నాయి.
ఇటీవల దేశానికి వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే టమాటా ధరలు పెరగడం. ప్రతి ఒక్కరూ టమాటా ధర పెరుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంట్లో ఏ కూర లేకపోయినా.. టమాటా చారుతో రసం పెట్టుకుని ఆ పూట భోజనం చేసే కుటుంబాలున్నాయి. లేదంటే టమాటాలో రెండు ఉల్లిపాయలు కోసి.. కూర వండుకుని కమ్మగా తినేసే బ్యాచులర్స్ ఎంతో మంది. అట్లాంటిది అమాంతంగా టమాటా ధరలు పెరిగి సామాన్యుడినే కాదూ సెలబ్రిటీలను బెంబేలెత్తించాయి. కిలో రూ. 20 ఉండే ఈ ఎర్రటి పండు ఈ రోజు మార్కెట్లో కిలో రూ. 200 వరకు పలుకుతోంది. ఎప్పుడూ లేని విధంగా టమాటా రైతు లాభపడుతున్నాడు. టమాటా కోసం దొంగతనాలు, హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఓ ఆటో డ్రైవర్ బంఫర్ ఆఫర్ ప్రకటించాడు.
టమాటా ధర రూ. 300 వరకు కూడా చేరవచ్చునని తెలుస్తోంది. అయితే కొన్ని ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ టమాటాల కోసం క్యూలు కడుతున్నారు సామాన్యులు. ఇదిలా ఉంటే పంజాబ్లోని చండీగఢ్కు చెందిన అరుణ్ అనే ఆటో డ్రైవర్ మాత్రం కిలో టమాటాలు ఇస్తానంటున్నాడు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయండోయ్. తన ఆటోలో ఐదు సార్లు రైడ్ చేసిన వారికి మాత్రం ఈ ఆఫర్ వర్తిస్తుందట. ఈ విషయాన్ని ఆటో వెనుక పోస్టర్ అంటించడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. టమాటా పెరుగుదలను బట్టి.. అవకాశంగా మార్చుకున్నాడనుకుంటే పొరపాటు. అతడు ఆర్మీ వ్యక్తుల కోసం గత 12 ఏళ్లుగా ఉచితంగా సర్వీసును అందిస్తున్నాడు. అలాగే గర్భిణీలకు కూడా అతడి ఆటోలో ప్రయాణం పూర్తిగా ఉచితం.
దీనిపై అరుణ్ స్పందిస్తూ.. ‘నాకున్న ఏకైక ఆదాయ మార్గం, వనరు ఆటోనే. దీని ద్వారా ఇలాంటి సేవలు అందించడం నాకు సంతృప్తిని ఇస్తుంది’అని అన్నారు. అంతేకాదు అక్టోబర్లో పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో భారత్ గెలిస్తే చండీగఢ్లో ఐదు రోజుల పాటు ఉచిత ప్రయాణాలను అందిస్తానని వెల్లడించారు. ప్రమాద బాధితులకు, గర్బిణీలకు ఉచితంగా సేవలు అందిస్తున్నందుకు చండీగఢ్ పోలీసుల నుండి సత్కారం కూడా అందుకున్నాడు. స్వలాభం, స్వార్థం కోసమే బతుకున్న ఈ రోజుల్లో పక్కవాడి గురించి ఆలోచిస్తున్న ఈ ఆటో డ్రైవర్ గురించి అభిప్రాయాలను మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి.