హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో బతకాలంటే ఖర్చులతో కూడుకున్న పని. ఇక ఎటైనా ప్రయాణించాలంటే బస్సులు లేదా ఆటోలను ఆశ్రయించాలి. పల్లెటూళ్లలో ఆటోలో వెళితే.. చాలా దూరానికి 10, 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. కానీ ఈ మహా నగరంలో కూసంత దూరానికి
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో బతకాలంటే ఖర్చులతో కూడుకున్న పని. ఇక ఎటైనా ప్రయాణించాలంటే బస్సులు లేదా ఆటోలను ఆశ్రయించాలి. పల్లెటూళ్లలో ఆటోలో వెళితే.. చాలా దూరానికి 10, 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. కానీ ఈ మహా నగరంలో కూసంత దూరానికి వందలకు వందలు అడిగేస్తుంటారు. ఇక బస్సుల్లో వెళదామంటే రద్దీ వేళల్లో ఎక్కలేని పరిస్థితి. ఇక ఓలా, ఊబర్ వంటి యాప్స్ సంగతి సరేసరి. డిమాండ్ ఉన్న టైమ్లో రేట్లను పెంచేస్తుంటాయి. క్యాన్సిల్ చేస్తే.. మళ్లీ రైడ్లో డబుల్ చార్జీలు వసూలు చేస్తుంటాయి. అటువంటి సమయంలో వచ్చింది మెట్రో. నగరాన్ని ఆ చివర నుండి ఈ చివరకు అనుసంధానిస్తూ చేపట్టిన మెట్రో ప్రాజెక్టు బాగా ఆదరణ పొందింది. అందుబాటులో చార్జీలు.. రయ్యి మంటూ దూసుకెళ్లు మెట్రోలు, సుఖవంతమైన ప్రయాణం కారణంగా దీన్నిచాలా మంది ఆశ్రయిస్తుంటారు.
ఇప్పుడు హైదరాబాద్ మెట్రో తీపి కబురు చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణీకులకు ప్రత్యేకమైన ఆఫర్ను అందిస్తోంది. ‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్’పేరుతో రూ. 59కే మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్ను కేవలం రూ.59ల రీచార్జ్ చేయించుకుని ఆ చివర నుండి ఈ చివరకు వరకు నగరం మొత్తం చుట్టేయోచ్చు. ఈ ఆఫర్ కేవలం 12,13, 15 తేదీల్లో మాత్రమే వర్తిస్తుందని మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వారంంతంలో మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు, ఎక్కువ మందిని రైళ్లల్లో ప్రయాణించేలా ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఆఫర్ను ప్రతి ఒక్కరూ సద్విని పర్చుకోవాలని ఆకాంక్షించారు