ఉద్యోగానికి లేదంటే ఏదైనా పనిమీద వెళ్లాలంటే బస్సులను ఆశ్రయిస్తుంటాం. ఇక అప్పటికప్పుడు దూర భారాలు వెళ్లాలంటే రైల్వే రిజర్వేషన్లు అందుబాటు ఉండవు కాబట్టి బస్టాండ్కు వెళ్లి బస్సు ఎక్కి ప్రయాణం సాగిస్తారు.
ఉద్యోగానికి లేదంటే ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలంటే బస్సులను ఆశ్రయిస్తుంటాం. ఇక అప్పటికప్పుడు దూర భారాలు వెళ్లాలంటే రైల్వే రిజర్వేషన్లు అందుబాటు ఉండవు కాబట్టి బస్టాండ్కు వెళ్లి బస్సు ఎక్కి ప్రయాణం సాగిస్తారు. మామూలూ రోజుల్లో అయితే సరిపోతుంది కానీ.. పండుగ, పర్వదినాలు, వీకెండ్స్లో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రద్దీ దృష్ట్యా రేట్లు పెరిగిపోతుంటాయి. ఇక ప్రైవేట్ బస్సుల దందా కూడా నడుస్తోంది. దీంతో చాలా మంది అంత డబ్బులు ఖర్చుపెట్టలేక మళ్లీ వెళొద్దామని ఆలోచిస్తుంటారు. అటువంటి వారికే ఓ శుభవార్త. కేవలం రూపాయి అంటే రూపాయితో మీ కొన్ని రూట్లలో బస్సులో ప్రయాణించే సదుపాయాన్ని కల్పిస్తోంది దేశంలోని అగ్రగామి ఇంటర్-సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సర్వీస్ న్యూగో సంస్థ.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూగో సంస్థ ప్రయాణీకులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయితో ఈ రూట్లతో ప్రయాణించవచ్చునని తెలిపింది. ఇందులో హైదరబాద్ నుండి విజయవాడతో పాటు ఇండోర్-భోపాల్, ఢిల్లీ-చండీఘర్, ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-దేహరాన్, ఢిల్లీ-జైపూర్, ఆగ్రా-జైపూర్, బెంగళూరు-తిరుపతి, చెన్నై-తిరుపతి, చెన్నై-పుదుచ్చేరి ఉన్నాయి. పర్యావరణ హితం వైపుగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ను ఆగస్టు 15న అందిస్తున్నట్లు న్యూగో ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో, ఎండీ దేవేంద్ర చావ్లా గురువారం ప్రకటించారు.
గురువారం ఉదయం నుండి ఈ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు 15న మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నట్లు ఎండీ తెలిపారు. https://nuego.in/booking వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. అధికారిక మొబైల్ అప్లికేషన్లలో కూడా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రయాణీకుల భద్రతలో పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో లాంగ్ జర్నీ చేయవచ్చునని నిరూపించేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. మీరు విజయవాడ వెళ్లాలంటే.. ఆగస్టు 15వ తేదీని సేవ్ చేసుకోండి. డబ్బులను ఆదా చేసుకోండి.