ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ బలోపేతం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలను కోరుతున్నారు. తాను ఇప్పటికే పార్టీ ఫండ్ గా రూ. 1000 ఇచ్చానని చెప్పడమే కాక ఇందుకు సంబంధించిన రిసిప్ట్ ను ట్విటర్ లో పోస్ట్ చేశారు. బీజేపీని బలోపేతం చేసేందుకు విరాళాలు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలను కోరారు.
ఈ క్రమంలో ‘నేను బీజేప కోసం పార్టీ ఫండ్ గా రూ. 1000 చెల్లించాను. దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది మన ఉద్దేశం. మైక్రో డోనేషన్ ద్వారా అందించే మీ చిన్న విరాళం ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి గల మా కేడర్ మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని, దేశాన్ని బలోపేతం చేయడంలో సాయం చేయండి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
I have donated Rs. 1,000 towards the party fund of the Bharatiya Janata Party.
Our ideal of always putting Nation First and the culture of lifelong selfless service by our cadre will be further strengthened by your micro donation.
Help make BJP strong. Help make India strong. pic.twitter.com/ENdytJYEj5
— Narendra Modi (@narendramodi) December 25, 2021
దాంతో పాటు తాను చెల్లించిన డొనేషన్ కు సంబంధించిన రిసిప్ట్ ఫోటోను కూడా షేర్ చేశారు మోదీ. మరో బీజేపీ నేత జేపీ నడ్డా కూడా పార్టీ ఫండ్ కోసం రూ. 1000 విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ‘‘నమో యాప్’ లో ఉన్న డొనేషన్ మాడ్యూల్ ద్వారా బీజేపీ బలోపేతం కోసం నా తరఫు విరాళం అందించాను. రిఫరల్ కోడ్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి బీజేపీని బలోపేతం చేసి… ప్రజలకు సేవ చేయ్యొచ్చు’ అని తెలిపారు.
ఈ విరాళాలు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభించింది. మైక్రో డొనేషన్స్ లో భాగంగా.. రూ. 5-1000 వరకు డొనేట్ చేయ్యొచ్చు.