ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై గుర్తు తెలియని డ్రోన్ కలకలం రేపింది. ఇవాళ ఉదయం ఆయన ఇంటిలో ఉన్న సమయంలో ఓ డ్రోన్ ఎగరడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రాలకు, ప్రముఖ రాజకీయ నేతల అధికారిక నివాసాలకు నో ఫ్లైయింగ్ జోన్ అనేది ఉంటుంది. అంటే ఈ దరిదాపుల్లోకి డ్రోన్ కెమెరా గానీ, విమానాలు గానీ ఎగరడానికి వీల్లేదు. ఆ మధ్య తిరుమలలో డ్రోన్ కెమెరా విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. నో ఫ్లైయింగ్ జోన్ ఏరియాలో డ్రోన్ కెమెరా ఎలా ఎగిరిందనే విషయంపై అప్పట్లో పెద్ద కలకలం రేపింది. తాజాగా ప్రధాని మోదీ అధికారిక నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. భద్రతా వైఫల్యం కారణంగా నరేంద్ర మోదీ నివాసంపై ఒక డ్రోన్ ఎగరడం పట్ల కలకలం రేగుతోంది. సోమవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఓ డ్రోన్ ప్రధాని న్విఅసం మీదుగా ఎగురుతున్నట్లు ప్రత్యేక భద్రతా విభాగం అధికారులు గుర్తించారు. వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు.
డ్రోన్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు ఆపరేట్ చేశారు? వంటి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రధాని నరేంద్ర మోదీ ఉండే నివాసం నో ఫ్లైయింగ్ జోన్ పరిధిలోకి వస్తుంది. అంటే ఈ నివాసం పై నుంచి విమానాలు గానీ, హెలికాప్టర్లు గానీ, డ్రోన్ లు గానీ ఎగరడానికి వీల్లేదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఉన్న సమయంలో డ్రోన్ కెమెరా హల్ చల్ చేయడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ప్రధాని అధికారిక నివాసం దేశ రాజధాని ఢిల్లీలోని లుటియన్స్ పరిధిలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉంది. 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ అధికారిక నివాసం ఉంది. 1980లో ఈ అధికారిక నివాస భవనాన్ని నిర్మించడం జరిగింది.