ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా బీజేపీ అధినాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి. ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో గెలుపు సొంతం చేసుకోవడానికి అధికార, ప్రతిపక్ష నేతలు గట్టి ప్లాన్ మీదే ఉన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నాయకత్వాలకు సంబంధించి కీలక మర్పులు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పలు కీలక మార్పులు తీసుకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీలో సంస్థాగతంగా పలు మార్పులు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ని తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం సూచించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సోము వీర్రాజుకి జేపీ నడ్డా పోన్ చేసి తెలియజేసినట్టుగా సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్ష పదవి రేసులో వై సత్యకుమార్, సుజనా చౌదరి ఉన్నప్పటికీ సీనీయర్ మహిళా నేత పురందేశ్వరి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేయడంతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది అధిష్టానం.