సమాజంలో ఆడవారి పట్ల నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్నారులు, యుక్తవయసు వారు, ముసలివాళ్లు అనే తేడా లేకుండా వారిపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక ఆడవారిపై నేరాలను అరికట్టిందేకు ప్రభుత్వం అనేక కఠిన చట్టాలు చేసినప్పటికి ఫలితం లేకుండా పోతుంది. ఇక్కడ మరో దురదృష్టకర అంశం ఏంటంటే..ఇలాంటి చట్టాలను కొందరు తమ స్వార్థం కోసం వినియోగించుకుంటూ.. మగవారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరాఖండ్లో వెలుగు చూసింది. కోడలు తనపై తప్పుడు కేసు పెట్టిందనే బాధతో ఓ మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు..
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మనవరాలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. ఆయన కోడులు.. కేసు పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్వస్థలం హల్దానీ నగరంలో వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందే రాజేంద్ర తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: Uttarakhand: కుమారుడిని వివాహం చేసుకున్న మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త!
వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి.. రాజేంద్రకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. తనపై కోడలు తప్పుడు కేసు పెట్టిందని పదే పదే చెప్తూ ఆవేదనకు లోనయ్యారు. పోలీసులు తాము దర్యాప్తు చేస్తామని.. ఆయనను కిందకు దిగి రావాల్సిందిగా కోరారు. ఒకదశలో ఆయన పోలీసులు మాటలు విన్నట్లే కనిపించినా.. కానీ ఆ వెంటనే మనసు మార్చుకున్న ఆయన.. తన దగ్గర ఉన్న తుపాకీతో ఛాతిభాగంపై కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆయన మరణించడానికి మూడు రోజుల క్రితమే.. కోడలు ఆయనపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దాంతో మనస్థాపానికి గురైన రాజేంద్ర.. తనువు చాలించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.