బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్త గారు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి కేరళలోని ఓ దేవాలయంలో దేవుడికి నైవేద్యం వండారు. అందరిలానే సాధారణ గృహిణిలా ఆమె కట్టెల పొయ్యి మీద ప్రసాదం వండి దేవుడికి నైవేద్యం పెట్టారు. అయితే దీన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్త గారు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి అయిన సుధామూర్తి కేరళలోని తిరువనంతపురంలో అట్టుకల్ భగవతి ఆలయంలో పొంగల్ పండుగలో భాగంగా వేలాది మంది మహిళలతో పాల్గొన్నారు. సాధారణ మహిళలా ఆమె గుడి ప్రాంగణంలో ఇటుకలతో పొయ్యి ఏర్పాటు చేసి దాని మీద కుండ పెట్టి దేవుడికి నైవేద్యం వండారు. ఈ ఫోటో ఎంతోమంది మనసులను గెలుచుకుంది. 35 వేల కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి అయిన ఆమె ఇలా నేల మీద కూర్చుని భక్తిని చాటుకోవడం పట్ల ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా మీలాంటి పెద్దవారు ప్రవర్తించడం మా అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న సుధా మూర్తిపై కొందరు విషం కక్కుతున్నారు. తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు.
‘సైలెంట్ గా ఉండండి. ఆమె ఏమీ పేదల కోసం వండడం లేదు. ఆమె ఏమీ సామాజిక సేవ చేయడం లేదు. ఆమె మిగతా మహిళల్లానే భక్తిని చాటుకుంది. దేవుడికి నైవేద్యం వండింది. దీనికి ఎందుకింత సీన్ చేస్తారు’ అని ఒకరు ట్విట్టర్ వేదికగా తన అక్కసుని వెళ్లగక్కారు. మరొకరు అయితే ఇది ఓవర్ యాక్టింగ్ అంటూ కామెంట్స్ చేశారు. మరొకరు అయితే రోజూ కట్టెల పొయ్యి మీదే వండుతుందంటనా? అని క్వశ్చన్ చేసే స్థాయికి వెళ్లిపోయారు. అంత అక్కసుతో ఓర్వలేక సోషల్ మీడియాలో పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఆ ప్రసాదం వండిపెడితే మాత్రం దేవుడు తింటాడా అని ప్రశ్నిస్తున్నారు. దేవుడికి పెట్టి వృధా చేసే బదులు అంత డబ్బు ఉంది కదా, లేని వారికి సహాయం చేయవచ్చు కదా అని అంటున్నారు. ఇంకొంతమంది అయితే దీన్ని రాజకీయం చేస్తున్నారు. మోదీ పాలనలో ఇప్పటికీ ఆమె వంట గ్యాస్ కొనలేకపోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భక్తిని ఇలా రాజకీయం కోసం హేళన చేస్తారా?
Calm down people. Sudha Murthy is not cooking for poor or doing some social service here. She has come to attend the Attukal pongala festival where women from all over gather and offer food to the Devi and cook it in similar manner. It’s the largest women’s gathering in Asia.
— ilizbethnoble (@ilizbethnoble) March 9, 2023
అసలు ఆమె చేసిన సామాజిక సేవ ఏముంది అని ప్రశ్నించే వారికి తెలియదు, ఆమె ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారో అనే విషయం. ఆమె ఒక పారిశ్రామికవేత్త, పరోపకారి, రైటర్.. ఆమె చేసిన పనులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంస్థకు చైర్ పర్సన్ గా, బ్యాక్ బోన్ గా ఉన్నారు. 1981 జూలై 2న ఆమె భర్తతో కలిసి ఇన్ఫోసిస్ కంపెనీని కనుగొన్నారు. 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. దారిద్య్ర నిర్మూలన, ప్రజా పరిశుభ్రత, విద్య అవసరం వంటి వాటి మీద ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. చదువు యొక్క ప్రాముఖ్యత ఆమెకు తెలుసు.. సమాజాన్ని పైకి తీసుకొచ్చేది చదువే అని నమ్మిన ఆమె ఆ చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించే దిశగా పని చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఆమె దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో 2300 ఇళ్ళు కట్టించారు. అలానే 7 వేల గ్రంథాలయాలు కట్టించారు. 16 వేల టాయిలెట్లు కట్టించారు.
సిలిండర్ రేట్లు పెంచారని అడిగితే ఈ ఫొటో అడ్డం పెట్టుకుంటారు. అదిసరే , సుధా మూర్తి రోజూ కట్టెల పొయ్యి మీదే వండుతుందటనా?
— Sujatha Velpuri (@VelpuriSujatha) March 10, 2023
నెలలో 10 రోజులు ఇప్పటికీ ఆమె గ్రామాలను సందర్శిస్తారు. ఫౌండేషన్ తరపున సహాయ కార్యక్రమాలను అమలు చేస్తారు. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న ప్రజారోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఆమె క్రియాశీల సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇది ఆమె జీవితంలో చేసిన 0.1 శాతం మాత్రమే. ఆమె చేసే సేవా కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ అవేమీ తెలియని వారు ఆమెను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆమెకు ఓవర్ యాక్షన్ అని, గ్యాస్ సిలిండర్ ధరను కూడా ఆమె భరించలేక కట్టెల పొయ్యి మీద వండుతుందని పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఆమె సమాజానికి చేసింది ఏమీ లేదని వాగుతున్నారు. సాధారణ భక్తురాలిలా ఇటుకల మీద కుండ పెట్టి నైవేద్యం వండడం ఆమె చేసిన తప్పా? అందరిలా సామాన్యురాలిలా భక్తిని చాటుకోవడం ఆమె చేసిన తప్పా? ఆమె ఏం తప్పు చేశారని ఆమెను తప్పుబడుతున్నారు? భక్తితో ఆమె దేవుడికి నైవేద్యం వండిన దాన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారు? దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
మరి ఆవిడేదో కట్టెల పొయ్యి మీద వండి వార్చే లాగ కవుర్లు చెప్తారేంటి? కట్టెలు మండనపుడు గొట్టంతో ఊది మంట రప్పించమనండి చూద్దాం
— Sujatha Velpuri (@VelpuriSujatha) March 10, 2023