బైక్-టాక్సీ సేవలను అందిస్తూ ప్రజలకు చేరువైన సంస్థలు ఉబర్, ర్యాపిడోలు. ఈ సంస్థలను నిషేధించాలంటూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు దీనిపై స్టే విధించింది.
మనం సాధారణంగా బయటికి వెళ్లాలంటే బైక్పై వెళతాం. ఆటోలో, కారులో, బస్సులో వెళతాం. అయితే ఒక్కోసారి అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే బైక్, టాక్సీ బుక్ చేసుకుంటాం. బైక్-టాక్సీ సేవలు అందిస్తున్న సంస్థల్లో ర్యాపిడో, ఉబర్లు కూడా ప్రధానమైనవి. ఈ సంస్థలు ప్రజలకు సేవలు అందించుటలో ముందుంటున్నాయి. ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చుటకు ప్రస్తుతం ఉబర్, ర్యాపిడోలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మన దేశ రాజధాని ఢిల్లీలో ఉబర్, ర్యాపిడోల సంస్థలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఇంతకుముందు ఈ సంస్థల సేవలపై ఢిల్లీ సర్కార్ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ర్యాపిడో, ఉబర్ సంస్థలు హైకోర్టుకు వెళ్లాయి. గత నెల 26న ఈ సంస్థల సర్వీసులు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు స్టే విధించింది. అసలు వివరాల్లోకి వెళితే..
మోటార్ వాహనాల చట్టం -1988 ను ఉల్లంఘిస్తున్నాయని ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ర్యాపిడో, ఉబర్ల సేవలను నిషేధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని.. బైక్-టాక్సీలపై నిషేధం తక్షణమే అమల్లోకి రావాలని హెచ్చరించారు. అయితే దీనిపై ఎలాంటి నిర్భంధమైన చర్యలకు పాల్పడకూడదని ఢిల్లీ హైకోర్టు మే 26న ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జులైనెల చివరికల్లా కొత్త విధానాన్ని తీసుకొస్తామని ఆప్ ప్రభుత్వం తన వాదనను వినిపించింది. కొత్త విధానాన్ని తీసుకొచ్చేంత వరకు ర్యాపిడో, ఉబర్ సేవలు నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ రాజేశ్ బిందల్
వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.