ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు ప్రత్యర్థులపై చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు ఇరుకున పెడుతుంటాయి. గత ఎన్నికల సమయంలో రాహూల్ గాంధీ, ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.
బైక్-టాక్సీ సేవలను అందిస్తూ ప్రజలకు చేరువైన సంస్థలు ఉబర్, ర్యాపిడోలు. ఈ సంస్థలను నిషేధించాలంటూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు దీనిపై స్టే విధించింది.
లోన్ చెల్లించకపోయినా, ఈఎంఐ ఆలస్యమైనా, ఓవర్ డ్యూ అయినా సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. అయితే సిబిల్ స్కోర్ తగ్గిందన్న కారణంగా వారికి లోన్లు మంజూరు చేయాల్సిందే అంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
దేశం ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కులం కట్టుబాట్లు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటాయి.. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు కులం ప్రస్తావన లేకుండా ఉండలేరు.
గత కొంతకాలం నుంచి తెలంగాణలో పేపర్ల లీకేజ్ వ్యవహారం హాట్ హాట్ గా ఉంది. ఇప్పటికీ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆకేసు విచారణ సాగుతున్న సమయంలోనే టెన్త్ ఎగ్జామ్స్ లో ప్రశ్నపత్రాల లీకేజ్ జరిగింది. వరుసగా తెలుగు, హిందీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు డిబార్ అయిన విద్యార్థికి కోర్టులో ఊరట లభించింది.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ చాట్ జీపీటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టెక్ రంగంలో అద్భుతాలు సృష్టించింది. ఇప్పుడు ఈ చాట్ జీపీటీపై న్యాయశాస్త్రంలో కూడా ప్రయోగం జరిగింది. దేశంలో తొలిసారి ఈ ప్రయోగం జరగడం విశేషం.
టీఎస్పీఎస్సీ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణలో ఎంతటి చర్చనీయాంశమైందో అందరికీ విదితమే. టీఎస్పీఎస్సీ బోర్డు నుంచే ప్రశ్నపత్రాలు లీక్ కావడమన్నది నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని చెప్పింది. ఇవి చాలవన్నట్లు టీఎస్పీఎస్సీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు హైకోర్టుకు సైతం ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
ప్రేమ పెళ్లి, ప్రేమ పేరుతో మోసం రెండూ ఈ సమాజంలో సర్వ సాధారణంగా కనిపిస్తున్న విషయాలు. చాలా మంది ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని సాగిస్తున్నారు. కొంతమంది మాత్రం ప్రేమ పేరుతో ఎదుటి వారిని మోసం చేస్తున్నారు. వీళ్లు కాకుండా ప్రేమించుకుని పలు కారణాల వల్ల పెళ్లి చేసుకోలేక విడిపోతున్న వాళ్లు కూడా ఉన్నారు.
ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మబలకడం.. ఆ తర్వాత మోసం చేసి ముఖం తిప్పుకోవడం వంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలా మోసం చేసేవారిలో ఆడా, మగా అనే తేడా లేకుండా పోతుంది. అయితే సామాన్యులే అనుకుంటే ఇలా మోసం చేసేవారిలో సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఎమ్మెల్యే ఒకరు తనను మోసం చేశారని.. పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ.. ఓ […]