టీసీఎస్ కంపెనీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్ గా సంస్థ కోసం కృషి చేసిన రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేశారు.
టీసీఎస్ లో సీఈఓగా పని చేసిన రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేశారు. సీఈఓగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. టీసీఎస్ సంస్థ బోర్డు కొత్త సీఈఓని ప్రకటించింది. కే. కృతివాసన్ ను సీఈఓగా నామినేట్ చేశారు. రాజేష్ గోపీనాథన్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేనేజింగ్ డైరెక్టర్ గా, సీఈఓగా నియమించనుంది కంపెనీ. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవలను అందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. మేనేజింగ్ డైరెక్టర్ గా, సీఈఓగా రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసినట్లు ప్రకటించింది. అయితే ఈయన సెప్టెంబర్ 15 2023 వరకు సంస్థలో పని చేస్తారని.. ఆ తర్వాత నుంచి కంపెనీ నుంచి తప్పుకుంటారని తెలిపింది.
మార్చి 16 2023 నుంచి కృతివాసన్ రాజేష్ గోపీనాథన్ తో కలిసి పని చేస్తారని తెలిపింది. ప్రస్తుతం కృతివాసన్ టీసీఎస్ కంపెనీలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ గ్రూప్ లకి హెడ్ గా ఉన్నారు. 1989లో టీసీఎస్ లో చేరిన ఈయన 34 ఏళ్లకు పైగా గ్లోబల్ టెక్నాలజీ సెక్టార్ లో పనిచేశారు. ఇన్నేళ్ల కాలంలో డెలివరీ,కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రాం మేనేజ్మెంట్ మరియు సేల్స్ వంటి విభాగాల్లో పలు రకాల నాయకత్వ పాత్రలను పోషించారు.
ఇక రాజేష్ గోపీనాథన్ గత ఆరేళ్లుగా మేనేజింగ్ డైరెక్టర్ గా, సీఈఓగా సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. టీసీఎస్ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లారు. 25 ఏళ్లుగా టీసీఎస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అయితే బోర్డు నిర్ణయం ప్రకారం కొత్త సీఈఓగా కృతివాసన్ ను నియమించినట్లు పేర్కొన్నారు. మరి రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.