దేశవ్యాప్తంగా ప్రజలు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సోదరిసోదరుల మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు. సోదరులు లేని వారు తండ్రి, అక్కా, అమ్మకు రాఖీ కడతారు. ఇంత వరకు ఓకే కానీ.. ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఓ మహిళ ఏకంగా చిరుత పులికి రాఖీ కట్టి.. అందరిని ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
రాజస్తాన్లోని ఓ గ్రామంలోకి కొన్ని రోజుల క్రితం ఓ చిరుత పులి వచ్చింది. దానికి ఒంటినిండా గాయాలున్నాయి. కదల్లేని పరిస్థితిలో ఉంది. పులి పరిస్థితి చూసిన గ్రామస్తులు.. దానిని అక్కున చేర్చుకుని.. సపర్యలు చేశారు. గాయాలకు కట్టు కట్టారు. ప్రస్తుతం పులి కోలుకుంటుంది. గ్రామస్థుల దాని ఆలనాపాలనా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా ఓ మహిళ చిరుత పులికి రాఖీ కట్టింది.
మరణించిన సోదరుడు ఇలా చిరుత రూపంలో తన దగ్గరకు వచ్చాడని భావించిన మహిళ.. దానికి రాఖీ కట్టి సంబరపడింది. ఈ సంఘటనను కొందరు వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో వీటిని షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి. మహిళ రాఖీ కట్టిన తర్వాత గ్రామస్తులు అనారోగ్యంగా ఉన్న పులిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
For ages, man & animal in India have lived in harmony with unconditional love to the wild.
In Rajasthan, a lady shows this unfettered love to our wild by tying a Rakhi(symbol of love & brotherhood ) to an ailing Leopard before handing over to Forest Department.
(As received) pic.twitter.com/1jk6xi1q10— Susanta Nanda IFS (@susantananda3) August 12, 2022