దేశంలో రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల ఎన్నో నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలు నడపడం, నిర్లక్ష్యం, అనుభవరాహిత్యం, అతి వేగం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదల వల్ల ఎన్నో వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతోమంద అనాథలుగా మిగిలిపోతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ జైపూర్ లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు బలంగా ఢీ కొట్టుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దౌసా జిల్లా మండవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. అల్వార్ నుంచి మహ్వా వైపు కూల్ డ్రింక్స్ లోడ్ తో వెళ్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న జీపును ఢీ కొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.
ప్రమాదం జరిగిన విషయం తెలియగానే పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే మహ్వా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడ్డ మరికొంతమందిని జైపూర్ హాస్పిటల్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి.. జేసీబీ సహాయంతో వాటిని తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.