పోక్సో, నిర్భయ, అభయ, దిశ వంటి చట్టాలు వచ్చినా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. చట్టాలు తమని ఏం చేస్తాయన్నా ఆలోచనతో లేదంటే చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని బయటకు వచ్చేయొచ్చు అన్న దుర్భుద్దితో ఆడవాళ్లు కనిపిస్తే చాలు.
దేశంలో నిత్యం ఏదో ఓ చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. పోక్సో, నిర్భయ, అభయ, దిశ వంటి చట్టాలు వచ్చినా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. చట్టాలు తమని ఏం చేస్తాయన్నా ఆలోచనతో లేదంటే చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని బయటకు వచ్చేయొచ్చు అన్న దుర్భుద్దితో ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు పశువుల్లా పడుతున్నారు. ఇంటా, బయటే కాదూ.. ప్రయాణ సమయాల్లోనూ వీరికి భద్రత కొరవడింది. చెరబట్టిన వాడిని వదిలేసి.. పాడైపోయిన అమ్మాయిని తప్పు పడుతోంది ఈ సమాజం. ఇక ప్రభుత్వాలు కూడా చట్టాలు చేసి, లేదంటే బాధితురాలిని, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తుంది. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని పట్టించుకునే నాదుడు ఉండడు.
ఇక నిందితుడు అరెస్టు అయ్యి చక్కగా బెయిల్ పై బయటకు వచ్చి తిరిగి అదే అమ్మాయిపై దాడి చేసిన సంఘటనలు కూడా చూశాం. అయితే ఇటువంటి వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు సిద్దమైంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మహిళలపై అత్యాచారాలు, దాడులు, వేధింపులకు పాల్పడిన వ్యక్తులు దోషులుగా నిరూపితమైతే ఇక ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువ పోగొట్టుకోవాల్సిందే. అలాంటి వారికి గవర్నమెంట్ జాబులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో జరుగుతున్న మహిళా అత్యాచారాలను అణచివేసేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అత్యాచార నేరస్తులు, రౌడీషీటర్లుగా ముద్ర పడితే ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులని ఆయన ట్వీట్ చేశారు.
‘బాలికలు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, వేధింపులకు పాల్పడిన దుర్మార్గులు.. ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటిస్తున్నాను. వారిపై నిషేధం ఉంటుంది. రౌడీ షీటర్లలా వీరి పేర్లు కూడా పోలీస్ స్టేషన్ రికార్డులో పొందుపరుస్తాం. పోలీసులు జారీ చేసే క్యారెక్టర్ సర్టిఫికేట్లో ఇదే విషయాన్ని పొందు పరుస్తాం. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులపై సామాజిక బహిష్కరణ అవసరం’అంటూ ట్వీట్ చేశారు. అలాంటి వ్యక్తుల పేర్లు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ వంటి ప్రభుత్వం ఉద్యోగాల రిక్రూట్మెంట్ బోర్డులకు పంపనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై విపక్ష బీజెపీ విమర్శలు చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.
राज्य सरकार ने फैसला किया है कि बालिकाओं एवं महिलाओं से छेड़छाड़, दुष्कर्म के प्रयास एवं दुष्कर्म के आरोपियों एवं मनचलों को सरकारी नौकरियों से प्रतिबंधित किया जाएगा। इसके लिए मनचलों का भी पुलिस थानों में हिस्ट्रीशीटरों की तरह रिकॉर्ड रखा जाएगा एवं राज्य सरकार/ पुलिस द्वारा जारी…
— Ashok Gehlot (@ashokgehlot51) August 8, 2023