పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో చుక్కెదురైంది. 2019లో కర్ణాటకలో మోడీ ఇంటి పేరు కలిగిన వారి మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో కింది కోర్టు ఆయన్ను దోషిగా తీర్పు చెప్పడంపై రాహుల్ అప్పీల్ చేసిన విషయం విదితమే. ఈ అప్పీలును సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును నిలుపుదల చేయాలని, సస్పెండ్ చేయాలంటూ ఆయన చేసిన వినతిని సెషన్స్ కోర్టు అంగీకరించలేదు. రాహుల్ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలను ఏప్రిల్ 13న కోర్టు స్వీకరించింది. ఆ తర్వాత తీర్పును రిజర్వు చేసింది. గురువారం ఈ తీర్పు వెలువడింది.
2019 కర్ణాటకలోని కోలార్లో నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దొంగలందరి ఇంటి పేరు మోడీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యల మీద గుజరాత్కు చెందిన పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసులో రాహుల్ను కోర్టు దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది. రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు సంచలన తీర్పుతో ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయింది. ఇది ముమ్మాటికీ కక్షపూరిత చర్యేనని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ అప్పీలును గనుక అనుమతించినట్లయితే, తీర్పును సస్పెండ్ చేసి ఉంటే ఆయన లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగి ఉండేది.
BREAKING
Surat Court DISMISSES Rahul Gandhi’s plea seeking stay of conviction in the criminal defamation case.#RahulGandhi pic.twitter.com/3G790MYN4N
— Live Law (@LiveLawIndia) April 20, 2023