మద్యం ప్రియులకు ఇది జీర్ణించుకోలేని వార్తే. గుండెని రాయి చేసుకోవాల్సిన వార్త. మద్యం ఉరుము అయితే అందులో మందుబాబులు మెరుపులు. మద్యం సంక్రాంతి ముగ్గయితే.. అందులో మందుబాబులు గొబ్బెమ్మలు. అలాంటి గొబ్బెమ్మని గంగిరెద్దు వచ్చి తొక్కినట్టు.. మద్యం సీసాలను రోడ్డు రోలర్ తో తొక్కిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అని గుండెలు పగిలేలా ఏడుస్తారు మద్యం ప్రియులు. మందు ఏమైనా చెట్టుకి కాస్తుందా? అంతలా రోడ్డు రోలర్ తో తొక్కించే బదులు మందు లేక గొంతు ఎండబెట్టుకుంటున్న మాబోటి వారికి దానం చేయవచ్చు కదా అని బాధపడతారు. మద్యం ప్రియులు అతిగా ఆవేశపడి.. ఆవేదన చెందే వార్త ఇది. మందు తాగేటోళ్లని అసహ్యించుకునే బ్యాచ్ కి.. తాగుబోతు సచ్చినోళ్లకి తిక్క బాగా కుదిరిందనుకునే వార్త ఇది.
అసలేం జరిగిందో తెలుసుకునే ముందు.. ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎవరైనా అక్రమంగా మద్యాన్ని తరలిస్తే.. పోలీసులు ఇట్టే పట్టేసుకుంటారు. పట్టేసుకున్న మందుని రోడ్డు రోలర్ తో తొక్కించేస్తారు. గతంలో ఇలాంటి తొక్కుడు కార్యక్రమాలు అనేకం జరిగాయి. ఆ మధ్య జూన్ నెలలో రోడ్డు రోలర్ తో 2.14 కోట్ల రూపాయల మద్యం సీసాలను తొక్కించారు. తాజాగా రూ. 58 లక్షల విలువ చేసే మద్యం సీసాలను కనికరం లేకుండా రోడ్డు రోలర్ తో తొక్కించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. చాందౌలీ జిల్లాలోని పోలీస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్.. 58 లక్షలు విలువ చేసే దేశీయ, విదేశీ మద్యం బాటిల్స్ ని ధ్వంసం చేసింది.
మద్యం బాటిల్స్ మీద రోడ్డు రోలర్ ని ఎక్కించి ధ్వంసం చేయించారు. అక్రమార్కుల నుంచి భారీగా అక్రమ మద్యం పట్టుబడడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టు నుంచి ఆదేశాలు జారీ కావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ, పోలీసులు, న్యాయాధికారుల సమక్షంలో 13 వేల 393 లీటర్ల మద్యం రోడ్డు రోలర్ తో తొక్కించబడింది. 2020, 2021 సంవత్సరాల్లో 112 కేసుల్లో పట్టుబడిన 10,806 లీటర్ల విదేశీ, 2587 లీటర్ల దేశీయ మద్యాన్ని సాయదరాజా పోలీసులు ధ్వంసం చేయించారు. అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని.. సాయదరాజా పోలీస్ స్టేషన్ వెనుక మూసివేసిన 2వ నంబర్ జాతీయ రహదారి మీద మద్యం సీసాలను ఉంచి.. రోడ్డు రోలర్ తో తొక్కించారు.
Uttar Pradesh | Police in Chandauli destroy over 13,000 litres of illegal liquor seized in 114 cases between 2020-2021 pic.twitter.com/STDf7ctyPM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 28, 2022
దీంతో పాటు ఖాళీగా ఉన్న మద్యం సీసాలను ఒక గొయ్యిలో పాతిపెట్టారు. జిల్లాలోని మద్యం ట్రేడర్లపై పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నందున.. మద్యం స్మగ్లర్ల వెన్నులో వణుకు పుడుతోంది. యూపీ సర్కార్ చేసిన ఈ పనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మద్యం సీసాలను రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేసిన యూపీ సర్కార్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
#BREAKINGNEWS chandauli UP police destroyed 13423 liters of liquor on NH2 by road roller pic.twitter.com/PqM1EpKWyq
— Abhishek Khanna (@Khannaabhi123) December 28, 2022