ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 238 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో జరిగిన రైలు ప్రమాద ఘటనల్లో అతి పెద్దది ఇదే కావచ్చు. అయితే ఇంత దారుణంలోనూ మానవత్వం పరిమళించింది. ఈ ఘటనల్లో గాయపడిన వారిని భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంక్, కటక్తో పాటు పలు ఆసుపత్రులకు తరలించారు. అయితే
ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 238 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో జరిగిన రైలు ప్రమాద ఘటనల్లో అతి పెద్దది ఇదే కావచ్చు. మూడు రైళ్లు ఢీ కొనడంతో ఇంతటి విపత్తు ప్రమాదం జరిగింది. భోగీల నుండి వెలికితీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. బెంగళూరు నుండి బెంగాల్లోని హౌరా వెళ్తున్న సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్, శాలీమర్-చెన్నై సెంట్రల్ వెళుతున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్తో పాటు ఓ గూడ్స్ రైలు గుద్దుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మూడు ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సుకు చెందిన 4 యూనిట్లు, 15 ఫైర్ రెస్య్కూ బృందాలు, 30 మంది వైద్యులు, 200 మంది పోలీసు సిబ్బంది, 60 అంబులెన్స్ లు ఘటనా స్థలిలో ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించారు.
బాలాసోర్లో జరిగిన ఈ ఘటన గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఇంత దారుణంలోనూ మానవత్వం పరిమళించింది. ఈ ఘటనల్లో గాయపడిన వారిని భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంక్, కటక్తో పాటు పలు ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రక్తం అవసరం ఉందని తెలిసి.. అనేక మంది స్వచ్ఛందంగా ఆసుపత్రులకు వెళ్లి రక్త దానం చేస్తున్నారు. రక్తం ఇచ్చేందుకు క్యూ కడుతున్నారంటే.. ఇంకా మానవత్వం మిగిలి ఉందని అనిపించకమానదు. క్షతగాత్రులను కాపాండేందుకు అక్కడి ప్రజలు ఆసుపత్రులకు చేరుకోవడంతో కిటకిటలాడుతున్నాయి. ఒక యుద్ధభూమిని, దేశాభిమానాన్ని తలపించినట్లు ఆ దృశ్యాలు ఉన్నాయి.
ఒక్క ఒడిశా నుండే కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా హాస్పిటల్స్కు వస్తున్నారు. వైద్యులు వారి ప్రాణాలను కాపాడేందుకు తమ శాయ శక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం రాత్రి రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు. బాలాసోర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గాయపడిన వారికి సహాయం చేయడానికి రాత్రి 2,000 మందికి పైగా వచ్చి, రక్తదానం చేశారు. వీరికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. బాలాసోర్లో రాత్రిపూట ఐదు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ప్రస్తుతం తొమ్మిది వందల యూనిట్లు స్టాక్లో ఉన్నాయి. ఇది ప్రమాద బాధితులకు చికిత్స చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.