ఇంట్లో నుండి పని మీద బయటకు వెళుతున్నప్పుడు నల్ల పిల్లి ఎదురొచ్చినా, తుమ్మినా బయటకు వెళ్లరు. అలాగే మంగళవారం ఏ పనులు చేయరు. శుక్రవారం డబ్బులతో పాటు పసుపు, కుంకుమలు ఇవ్వరు. అలాగే అమెరికాలో శుక్రవారం 13 వచ్చిందంటే కీడు జరుగుతుందని భావిస్తుంటారు. ప్రతి మనిషికో వింత నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఇలాగే ఓ ప్రమాదాన్ని ముడిపెట్టి చూస్తున్నారు.
ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 238 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో జరిగిన రైలు ప్రమాద ఘటనల్లో అతి పెద్దది ఇదే కావచ్చు. అయితే ఇంత దారుణంలోనూ మానవత్వం పరిమళించింది. ఈ ఘటనల్లో గాయపడిన వారిని భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంక్, కటక్తో పాటు పలు ఆసుపత్రులకు తరలించారు. అయితే