ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ వాదాన్ని వినిపిస్తూ.. ద్రవిడ మోడల్ పాలనను యావత్ దేశానికి చూపిస్తామన్నారు. అంతేగాక తమిళనాడులో తమిళమే మాట్లాడతామంటూ పేర్కొన్నారు. కేంద్రంతో సంఘీభావంగా ఉంటామంటూనే..రాష్ట్ర డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలతో కేంద్రం కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి అని స్టాలిన్ వెల్లడించారు. ఈ క్రమంలో స్టాలిన్, ప్రధాని ముందు కొన్ని డిమాండ్లుపెట్టారు.
‘హిందీని కాకుండా తమిళ భాషను అధికారిక భాషగా గుర్తించాలంటూ సీఎం స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాని కోరారు. తాము నీట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నామని, అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశ పెట్టామని ఈ క్రమంలో గుర్తు చేశారు. హిందీలాగే మద్రాస్ హైకోర్టులో తమిళ్ను అధికార భాషగా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు’.
‘అనంతరం కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలను ప్రస్తావించిన స్టాలిన్.. కేంద్రం నుంచి తమిళనాడుకు నిధులు రావడం లేదని ప్రధాని ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు. రాష్ట్రాలతో కేంద్ర కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని కూడా ఆయన తెలిపారు. తమిళనాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులను విడుదల చేయాలని కూడా సభా వేదికగానే మోదీని స్టాలిన్ కోరారు’.
#Breaking: Tamil Nadu CM MK Stalin speaks on language war as the PM listens;
Says, “Don’t impose Hindi on us. Consider Tamil equal to Hindi.” #TamilNadu #NarendraModi #6PMPrime | @Akshita_N pic.twitter.com/2Swx4PBpyc— IndiaToday (@IndiaToday) May 26, 2022
ఇది కూడా చదవండి: narendra modi: మోదీని సర్ప్రైజ్ చేసిన జపాన్ బాలుడు.. ఆశ్చర్యపోయిన ప్రధాని!
చైన్నైలో పర్యటించిన ప్రధాని మోడీ.. స్టాలిన్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 31,000 కోట్ల రూపాయలతో 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాగా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మోదీ తమిళనాడులో పర్యటించడం ఇదే తొలిసారి. మొదట చెన్నై చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్లో అడయార్లోని ఐఎన్ఎస్ నేవల్ బేస్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు. మరోవైపు.. ప్రధాని మోదీ చెన్నై పర్యటనలో హైడ్రామా చోటు చేసుకుంది. మోదీ సభకు వేదికైన నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అటు డీఎంకే మద్దతుదారులు, ఇటు బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని మోదీ జిందాబాద్ అని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా .. దళపతి జిందాబాద్ అంటూ డీఎంకే కార్యకర్తలు నినాదాలు చేశారు.
Nice pic of #TN #CM @mkstalin welcoming #PM @narendramodi with the Tamil epic #Cilappatikaram at the INS Adyar in Chennai. pic.twitter.com/1OJiXPlohQ
— Sreedhar Pillai (@sri50) May 26, 2022